చెక్ కేసులో మహిళకు జైలు శిక్ష సమర్థన
- June 13, 2017
మనామా:హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు, డూడ్ చెక్స్ ఇచ్చిన కేసులో మహిళకు కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. తనపై విధింపబడ్డ శిక్షను సవాల్ చేస్తూ హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టుని నిందితురాలు ఆశ్రయించడం జరిగింది. అయితే నిందితురాలు అకౌంట్లో డబ్బులు లేకుండా మొత్తం 33 చెక్లను ఇచ్చి తనను మోసం చేసిందని బాధితురాలు న్యాయస్థానానికి నివేదించారు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితురాలి అభ్యర్థనను తిరస్కరించింది. నిందితురాలికి ఐదేళ్ళ రెండు నెలల జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. పలువురు వ్యక్తుల నుంచి నిందితురాలు 45,700 బహ్రెయినీ దినార్స్ అక్రమంగా సొంతం చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఓ వ్యక్తి నుంచే ఆమె 15,000 బహ్రెయినీ దినార్స్కి పైగా లాక్కున్నట్లు విచారణలో పోలీసులు తేల్చారు.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









