దీక్ష విరమించాలని పోలీసులు జగన్ను కోరారు
- October 12, 2015
ప్రత్యేక హోదాకోసం నిరవదిక దీక్ష చేస్తున్న వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం వేకువజామున పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో అత్యవసర సేవల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. సోమవారం రాత్రి నిర్వహించిన వైద్య పరీక్షల్లో జగన్మోహన్రెడ్డికి వైద్యం అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంగళవారం వేకువజాము వరకు దీక్ష ప్రాంగణం వద్దనే వేచి ఉన్నారు. తొలుత దీక్ష విరమించాలని పోలీసులు జగన్ను కోరగా ఆయన నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబులెన్స్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే ప్రత్యేక బృందంతో ఉన్న పోలీసులు భారీగా మోహరించి జగన్ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడ కార్డియాలజీ విభాగంలో జగన్కు వైద్యసేవలందించారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







