దీక్ష విరమించాలని పోలీసులు జగన్ను కోరారు
- October 12, 2015
ప్రత్యేక హోదాకోసం నిరవదిక దీక్ష చేస్తున్న వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం వేకువజామున పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో అత్యవసర సేవల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. సోమవారం రాత్రి నిర్వహించిన వైద్య పరీక్షల్లో జగన్మోహన్రెడ్డికి వైద్యం అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంగళవారం వేకువజాము వరకు దీక్ష ప్రాంగణం వద్దనే వేచి ఉన్నారు. తొలుత దీక్ష విరమించాలని పోలీసులు జగన్ను కోరగా ఆయన నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబులెన్స్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే ప్రత్యేక బృందంతో ఉన్న పోలీసులు భారీగా మోహరించి జగన్ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడ కార్డియాలజీ విభాగంలో జగన్కు వైద్యసేవలందించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







