ఫిలింఫేర్ అవార్డ్స్లో లో ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న సరైనోడు
- June 17, 2017
తాజాగా జరిగిన 64వ జియో ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్కి సంబంధించి 2016లో విడుదలైన సరైనోడు సినిమాకుగాను ఉత్తమ నటుడు ( క్రిటిక్స్ ) అవార్డ్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా ఈ అవార్డు అల్లు అర్జున్ అందుకోవడం జరిగింది.
ఈ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ మాట్లాడుతూ. సరైనోడు చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను వల్లే తనకి ఈ అవార్డ్ దక్కిందని తెలిపాడు. అంతేకాకుండా ఈ అవార్డుని దాసరి నారాయణ రావు గారికి అంకితం ఇస్తున్నానని తెలిపాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ మాట్లాడుతున్న సమయం లో అభిమానులంతా డీజే..డీజే అని అరవడం తో బన్నీ నవ్వుతూ.. సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని సరదాగా ప్రశ్నిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జూన్ 23 న డీజే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా , దిల్ రాజు నిర్మాత.
తాజా వార్తలు
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం









