ఫిలింఫేర్ అవార్డ్స్లో లో ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న సరైనోడు
- June 17, 2017
తాజాగా జరిగిన 64వ జియో ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్కి సంబంధించి 2016లో విడుదలైన సరైనోడు సినిమాకుగాను ఉత్తమ నటుడు ( క్రిటిక్స్ ) అవార్డ్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా ఈ అవార్డు అల్లు అర్జున్ అందుకోవడం జరిగింది.
ఈ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ మాట్లాడుతూ. సరైనోడు చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను వల్లే తనకి ఈ అవార్డ్ దక్కిందని తెలిపాడు. అంతేకాకుండా ఈ అవార్డుని దాసరి నారాయణ రావు గారికి అంకితం ఇస్తున్నానని తెలిపాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ మాట్లాడుతున్న సమయం లో అభిమానులంతా డీజే..డీజే అని అరవడం తో బన్నీ నవ్వుతూ.. సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని సరదాగా ప్రశ్నిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జూన్ 23 న డీజే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా , దిల్ రాజు నిర్మాత.
తాజా వార్తలు
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి







