గుండెపోటుతో మరో ప్రవాసీయ భారతీయుడు మృతి

- June 19, 2017 , by Maagulf
గుండెపోటుతో మరో ప్రవాసీయ భారతీయుడు  మృతి

మనామా: హృదయ సంబంధిత వ్యాధులతో ప్రవాసియ భారతీయలు ఇటీవల గల్ఫ్ దేశాలలో విషాదంగా ప్రాణాలు విడుస్తున్నారు. ఇదే క్రమంలో గుడాబియాలో ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో  అల్లక్కల్ ప్రభాకర్ సేతుమాధవన్ అనే ప్రవాసియ భారతీయుడు తన అపార్ట్మెంట్ లో గుండె ఆగిపోవడంతో మరణించాడు. ఒయాసిస్ పెర్ ఫ్యూమ్స్ (అత్తరు) కంపెనీలో విక్రయాల ప్రతినిధిగా పనిచేశాడు. ఆయన గత కొంతకాలంగా తన భార్యతో ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. మేము ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన అపస్మారక స్థితిలో  ఉండగా కనుగొన్నామని వెంటనే స్పందించి  అంబులెన్స్ ని పిలిపించామని తెలిపారు. ఆయనను పరీక్షించిన అంబులెన్స్ లోని వైద్య సిబ్బంది దాదాపు 10 నిమిషాల క్రితమే గుండెపోటుతో అల్లక్కల్ ప్రభాకర్ సేతుమాధవన్  చనిపోయాడని తెలిపారు.  ఆయన కు సంబంధిన మరణధ్రువీకరణ పత్రాలు తదితర  అనుమతి పత్రాల పని పూర్తికావడం కాగానే ఆయన భౌతికకాయాన్ని వెంటనే భారతదేశానికి పంపుతాము పొరుగు నివాసి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com