గుండెపోటుతో మరో ప్రవాసీయ భారతీయుడు మృతి
- June 19, 2017
మనామా: హృదయ సంబంధిత వ్యాధులతో ప్రవాసియ భారతీయలు ఇటీవల గల్ఫ్ దేశాలలో విషాదంగా ప్రాణాలు విడుస్తున్నారు. ఇదే క్రమంలో గుడాబియాలో ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో అల్లక్కల్ ప్రభాకర్ సేతుమాధవన్ అనే ప్రవాసియ భారతీయుడు తన అపార్ట్మెంట్ లో గుండె ఆగిపోవడంతో మరణించాడు. ఒయాసిస్ పెర్ ఫ్యూమ్స్ (అత్తరు) కంపెనీలో విక్రయాల ప్రతినిధిగా పనిచేశాడు. ఆయన గత కొంతకాలంగా తన భార్యతో ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. మేము ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉండగా కనుగొన్నామని వెంటనే స్పందించి అంబులెన్స్ ని పిలిపించామని తెలిపారు. ఆయనను పరీక్షించిన అంబులెన్స్ లోని వైద్య సిబ్బంది దాదాపు 10 నిమిషాల క్రితమే గుండెపోటుతో అల్లక్కల్ ప్రభాకర్ సేతుమాధవన్ చనిపోయాడని తెలిపారు. ఆయన కు సంబంధిన మరణధ్రువీకరణ పత్రాలు తదితర అనుమతి పత్రాల పని పూర్తికావడం కాగానే ఆయన భౌతికకాయాన్ని వెంటనే భారతదేశానికి పంపుతాము పొరుగు నివాసి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







