గుండెపోటుతో మరో ప్రవాసీయ భారతీయుడు మృతి
- June 19, 2017
మనామా: హృదయ సంబంధిత వ్యాధులతో ప్రవాసియ భారతీయలు ఇటీవల గల్ఫ్ దేశాలలో విషాదంగా ప్రాణాలు విడుస్తున్నారు. ఇదే క్రమంలో గుడాబియాలో ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో అల్లక్కల్ ప్రభాకర్ సేతుమాధవన్ అనే ప్రవాసియ భారతీయుడు తన అపార్ట్మెంట్ లో గుండె ఆగిపోవడంతో మరణించాడు. ఒయాసిస్ పెర్ ఫ్యూమ్స్ (అత్తరు) కంపెనీలో విక్రయాల ప్రతినిధిగా పనిచేశాడు. ఆయన గత కొంతకాలంగా తన భార్యతో ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. మేము ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉండగా కనుగొన్నామని వెంటనే స్పందించి అంబులెన్స్ ని పిలిపించామని తెలిపారు. ఆయనను పరీక్షించిన అంబులెన్స్ లోని వైద్య సిబ్బంది దాదాపు 10 నిమిషాల క్రితమే గుండెపోటుతో అల్లక్కల్ ప్రభాకర్ సేతుమాధవన్ చనిపోయాడని తెలిపారు. ఆయన కు సంబంధిన మరణధ్రువీకరణ పత్రాలు తదితర అనుమతి పత్రాల పని పూర్తికావడం కాగానే ఆయన భౌతికకాయాన్ని వెంటనే భారతదేశానికి పంపుతాము పొరుగు నివాసి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









