జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరా-మంత్రి కేటీఆర్

- June 20, 2017 , by Maagulf
జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరా-మంత్రి కేటీఆర్

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ పథకాలైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో పాటు బీడీలు, గ్రానైట్ పరిశ్రమలకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. 450 కోట్ల వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధి బకాయిలను వెంటనే విడుదల చేయాలని జైట్లీని విజ్ఞప్తి చేశారు. ఫ్లైఓవర్లు , స్కైవేస్  నిర్మాణం కోసం కంటోన్మెంట్ పరిధిలోని భూముల బదిలీ, FRBM పరిమితి 3.25 నుంచి 3.5 శాతానికి పెంచడంపై కూడా చర్చించారు. తమ విజ్ఞప్తులకు జైట్లీ సానుకూలంగా స్పందించారని కేటీఆర్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com