కబ్ద్ జాతీయ రహదారిలో తగలపడిపోయిన కారు...వ్యక్తి సజీవ దహనం
- June 21, 2017
పరుగులు పెడుతున్న ఓ కారు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడి క్షణాలలో వాహనం తగిలబడిపోయిన సంఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కబ్ద్ జాతీయ రహదారిలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో అగ్నిజ్వాలల నడుమ తప్పించుకోలేక ఆ వ్యక్తి కాలి బూడిదయ్యాడని భద్రతావర్గాలు తెలిపాయి. కారు ప్రమాదానికి గురైన వాస్తవ కారణాన్ని నిర్ధారించేందుకు విచారణ ప్రారంభమైంది. కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ దోహా స్పూర్ ప్రత్యేకంగా సన్నివేశ స్థలంలో వాహనం అగ్నికి ఏ విధంగా గురైందో నివేదించారు. మంటలలో చిక్కుకొన్న వాహనంలోకి ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో మంటల నుంచి రక్షించబడ్డారు. వారిని మెరుగైన చికిత్స కోసం స్థానిక జహ్రా ఆసుపత్రికి తరలించారు. కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు వెలువడ్డాయి.సల్మియా అగ్నిమాపకదళ సిబ్బంది పంపబడ్డారు. అగ్నిని ఇంజిన్ నుంచి వాహనం లోపలకు వ్యాపించకుండా అడ్డుకునేందుకు నియంత్రించ గలిగినట్లు పేర్కొన్నారు. మిగతావారికి ఎటువంటి ప్రాణనష్టం లేదని నివేదించబడింది. ఇద్దరు పౌరులు కారు లోపల చిక్కుకున్న తర్వాత డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని అనేక సార్లు ప్రామాదం చేయబోయాడని భద్రతా మూలాల పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







