బంధువు ఇచ్చిన బాంబుని దాచేందుకు వెళ్తూ వ్యక్తి దుర్మరణం
- June 21, 2017
మనామా: ఒక బహ్రయిన్ వ్యక్తి బాంబుని భూమిలో పాతి పెడతానికి వెళ్తూ, దారిలో అది ఒక్కసారిగా పేలడంతో దుర్మరణం చెందాడు. సోమవారం ఉత్తర గవర్నెట్ పరిధిలో అల్ హజార్ గ్రామంలో ఉన్న ఒక పొలంలో రహస్యంగా ఆ బాంబుని దాచేందుకు వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన బాంబు పేలుడు కారణంగా ఆ వ్యక్తి మరణం సంభవించినట్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ వెల్లడించింది. చనిపోయిన వ్యక్తి 40 ఏళ్ళ నబీల్ అబ్దుల్లా అహ్మద్ అల్ సమేహెగా గుర్తించారు. ఆ బాంబు అతని బంధువులలో ఒకరి ద్వారా ఇవ్వబడింది. ఈ నేపథ్యంలో బాంబుని దాచేందుకు వెళ్తూ అల్ హజార్ గ్రామమును దాటుతూ ఉండగా, అతని చేతిలో ఆ బాంబు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. చనిపోయిన వ్యక్తికి బాంబు ఇచ్చిన బంధువుకు గతంలోనూ ఇలాంటి సంఘటనల స్క్మబంధం ఉన్నట్లు తెలియడంతో ఈ కేసు దర్యాప్తు సంబంధిత అధికారుల విచారణ ప్రారంభించిందని ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ జూన్ 19 న హజార్ గ్రామంలో బాంబు పేలుడు ఫలితంగా మరణించినట్లు తెలుస్తోంది. అవసరమైన భద్రత చట్టబద్దమైన చర్యలకు సంబంధించి మరిన్ని వివరాల గూర్చి పరిశోధనలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







