బంధువు ఇచ్చిన బాంబుని దాచేందుకు వెళ్తూ వ్యక్తి దుర్మరణం

- June 21, 2017 , by Maagulf
బంధువు ఇచ్చిన బాంబుని దాచేందుకు వెళ్తూ వ్యక్తి దుర్మరణం

మనామా: ఒక బహ్రయిన్ వ్యక్తి  బాంబుని భూమిలో పాతి పెడతానికి వెళ్తూ, దారిలో అది ఒక్కసారిగా పేలడంతో దుర్మరణం చెందాడు. సోమవారం ఉత్తర  గవర్నెట్ పరిధిలో అల్ హజార్ గ్రామంలో ఉన్న ఒక పొలంలో రహస్యంగా  ఆ బాంబుని దాచేందుకు వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన బాంబు పేలుడు కారణంగా ఆ వ్యక్తి మరణం సంభవించినట్లు  క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ వెల్లడించింది. చనిపోయిన వ్యక్తి 40 ఏళ్ళ  నబీల్ అబ్దుల్లా అహ్మద్ అల్ సమేహెగా గుర్తించారు. ఆ బాంబు  అతని బంధువులలో ఒకరి ద్వారా ఇవ్వబడింది. ఈ నేపథ్యంలో బాంబుని దాచేందుకు వెళ్తూ అల్ హజార్ గ్రామమును దాటుతూ ఉండగా, అతని చేతిలో ఆ  బాంబు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. చనిపోయిన వ్యక్తికి బాంబు ఇచ్చిన బంధువుకు గతంలోనూ ఇలాంటి సంఘటనల స్క్మబంధం ఉన్నట్లు తెలియడంతో ఈ కేసు దర్యాప్తు సంబంధిత అధికారుల విచారణ ప్రారంభించిందని ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ జూన్ 19 న హజార్ గ్రామంలో బాంబు పేలుడు ఫలితంగా మరణించినట్లు తెలుస్తోంది. అవసరమైన భద్రత చట్టబద్దమైన చర్యలకు సంబంధించి మరిన్ని వివరాల గూర్చి పరిశోధనలు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com