బంధువు ఇచ్చిన బాంబుని దాచేందుకు వెళ్తూ వ్యక్తి దుర్మరణం
- June 21, 2017
మనామా: ఒక బహ్రయిన్ వ్యక్తి బాంబుని భూమిలో పాతి పెడతానికి వెళ్తూ, దారిలో అది ఒక్కసారిగా పేలడంతో దుర్మరణం చెందాడు. సోమవారం ఉత్తర గవర్నెట్ పరిధిలో అల్ హజార్ గ్రామంలో ఉన్న ఒక పొలంలో రహస్యంగా ఆ బాంబుని దాచేందుకు వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన బాంబు పేలుడు కారణంగా ఆ వ్యక్తి మరణం సంభవించినట్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ వెల్లడించింది. చనిపోయిన వ్యక్తి 40 ఏళ్ళ నబీల్ అబ్దుల్లా అహ్మద్ అల్ సమేహెగా గుర్తించారు. ఆ బాంబు అతని బంధువులలో ఒకరి ద్వారా ఇవ్వబడింది. ఈ నేపథ్యంలో బాంబుని దాచేందుకు వెళ్తూ అల్ హజార్ గ్రామమును దాటుతూ ఉండగా, అతని చేతిలో ఆ బాంబు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. చనిపోయిన వ్యక్తికి బాంబు ఇచ్చిన బంధువుకు గతంలోనూ ఇలాంటి సంఘటనల స్క్మబంధం ఉన్నట్లు తెలియడంతో ఈ కేసు దర్యాప్తు సంబంధిత అధికారుల విచారణ ప్రారంభించిందని ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ జూన్ 19 న హజార్ గ్రామంలో బాంబు పేలుడు ఫలితంగా మరణించినట్లు తెలుస్తోంది. అవసరమైన భద్రత చట్టబద్దమైన చర్యలకు సంబంధించి మరిన్ని వివరాల గూర్చి పరిశోధనలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









