బంధువు ఇచ్చిన బాంబుని దాచేందుకు వెళ్తూ వ్యక్తి దుర్మరణం
- June 21, 2017
మనామా: ఒక బహ్రయిన్ వ్యక్తి బాంబుని భూమిలో పాతి పెడతానికి వెళ్తూ, దారిలో అది ఒక్కసారిగా పేలడంతో దుర్మరణం చెందాడు. సోమవారం ఉత్తర గవర్నెట్ పరిధిలో అల్ హజార్ గ్రామంలో ఉన్న ఒక పొలంలో రహస్యంగా ఆ బాంబుని దాచేందుకు వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన బాంబు పేలుడు కారణంగా ఆ వ్యక్తి మరణం సంభవించినట్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ వెల్లడించింది. చనిపోయిన వ్యక్తి 40 ఏళ్ళ నబీల్ అబ్దుల్లా అహ్మద్ అల్ సమేహెగా గుర్తించారు. ఆ బాంబు అతని బంధువులలో ఒకరి ద్వారా ఇవ్వబడింది. ఈ నేపథ్యంలో బాంబుని దాచేందుకు వెళ్తూ అల్ హజార్ గ్రామమును దాటుతూ ఉండగా, అతని చేతిలో ఆ బాంబు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. చనిపోయిన వ్యక్తికి బాంబు ఇచ్చిన బంధువుకు గతంలోనూ ఇలాంటి సంఘటనల స్క్మబంధం ఉన్నట్లు తెలియడంతో ఈ కేసు దర్యాప్తు సంబంధిత అధికారుల విచారణ ప్రారంభించిందని ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ జూన్ 19 న హజార్ గ్రామంలో బాంబు పేలుడు ఫలితంగా మరణించినట్లు తెలుస్తోంది. అవసరమైన భద్రత చట్టబద్దమైన చర్యలకు సంబంధించి మరిన్ని వివరాల గూర్చి పరిశోధనలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!
- సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!
- అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- యూనిఫైడ్ జిసిసి రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టంపై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- టీవీ లేకపోయినా పర్లేదు..మీ మొబైల్లో బడ్జెట్ స్పీచ్ చూసేయండి







