కొత్త రాష్ట్రపతి అభ్యర్ధిగా తెరపైకి అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్
- June 22, 2017
రాష్ట్రపతి పదవికి ద్విముఖ పోటీ ఖాయమైంది. ఎన్డీఏ అభ్యర్థిగా దళిత నేత రామ్ నాథ్ కోవింద్ రంగంలోకి దిగుతుండగా.. విపక్షాలు కూడా ప్రకాశ్ అంబేద్కర్ లేదంటే మీరా కుమార్ ను బరిలోకి దింపాలనుకుంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేసే అవకాశం లేకపోవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇవాళ కోవింద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
భారత దేశ చరిత్రలో రాష్ట్రపతి ఎన్నిక ఒకే ఒకసారి ఏకగ్రీవమైంది. ఇప్పుడా పరిస్థితిని పునరావృతం చేద్దామని ప్రయత్నించిన ప్రధాని మోడీకి విపక్షాలు మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి అనూహ్యంగా అభ్యర్థిని తెరపైకి తెచ్చాయి. పోటీ ఉండాల్సిందే అంటూ వామపక్షాలు డిసైడ్ అయ్యాయి. దీంతో కోవింద్కు పోటీగా అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ పేరును తెరపైకి తెచ్చింది సీపీఎం. అప్పుడే గట్టి పోటీ ఉంటుందని భావిస్తోంది. ప్రస్తుతం భరిఫ్ బహుజన్ మహాసంఘ్కు నేతృత్వం వహిస్తున్న ప్రకాశ్ అంబేద్కర్ రెండు సార్లు లోక్సభ, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. మరోవైపు మీరాకుమార్, సుశీల్ కుమార్ షిండే పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వీరిలో ఒకర్ని ఇవాళ జరిగే సమావేశంలో యూపీఏ ఖరారు చేయనుంది.
అటు ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ కు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ ప్రిపేర్ చేశారు. తొలి సెట్ పై ప్రధాని మోడీ సంతకం చేయనుండగా, రెండో సెట్ పై సీఎం చంద్రబాబు, మూడో సెట్ పై అమిత్ షా, నాలుగో సెట్ పై పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ సంతకాలు చేయనున్నారు.
తనను ఎన్డీఏ తరపు అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు రామ్ నాథ్ కోవింద్ బీజేపీ సీనియర్లందరినీ కలిసి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్లు అద్వానీ, మురళీమనోహర్ జోషిని కలుసుకుని ధన్యవాదాలు చెప్పారు. వారు కూడా కోవింద్ కు సంపూర్ణ ఆశీస్సులు అందజేశారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









