పాస్‌పోర్ట్‌ సీజ్‌: బోర్డర్‌లో ఇరుక్కున వ్యక్తి

- June 22, 2017 , by Maagulf
పాస్‌పోర్ట్‌ సీజ్‌: బోర్డర్‌లో ఇరుక్కున వ్యక్తి

ఖతారీ జాతీయుడొకరు, సౌదీ అరేబియా - ఖతార్‌ మధ్య బోడర్డర్‌లో గత కొద్ది రోజులుగా ఇరుక్కుపోయారు. సెక్యూరిటీ ఫోర్సెస్‌ అతని పాస్‌పోర్ట్‌ని సీజ్‌ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జాయెద్‌ బెన్‌షాఫా అల్‌ ఘోర్ఫాని అనే ఖతారీ పౌరుడు, సౌదీ బోర్డర్‌ని క్రాస్‌ చేయడం జరిగింది. గడువులోగా వెళ్ళిపోవాల్సిందిగా జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో అతను బోర్డర్‌ని క్రాస్‌ చేయాల్సి వచ్చింది. అయితే ఖతార్‌లోకి ప్రవేశాన్ని అడ్డుకున్న భద్రతా దళాలు, వెనక్కి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. అటు సౌదీ అరేబియా వెళ్ళలేక ఇటు ఖతార్‌లోకి రాలేక జాయెద్‌ సతమతమవుతున్నాడు. సోషల్‌ మీడియా ద్వారా తన పరిస్థితిని ఆయన వెల్లడించాడు. గడచిన 14 రోజుల్లో ఇలాంటివి 4 ఘటనలు చోటుచేసుకున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com