హైదరాబాద్లో రక్తం కల్తీ..
- June 24, 2017
హైదరాబాద్ కల్తీ మయం అయిపోతోంది. పాలు.. ఆహార పదార్థాల కల్తీ నుంచి మరో మెట్టు ఎక్కి.. రక్తాన్ని సైతం కల్తీ చేసే దశకు చేరుకుంది. అధికారుల అలసత్వాన్ని సాకుగా చేసుకుని.. రెచ్చిపోతున్నారు కల్తీ రాయుళ్లు. రోగుల ప్రాణాలను కాపాడే రక్తాన్ని సైతం కల్తీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని ఎందరో దాతలు ఇచ్చిన రక్తంతో .. కల్తీ వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్లోని ఓ బ్లడ్ బ్యాంక్.. ఓ నెగిటివ్ రక్తాన్ని ఇలానే కల్తీ చేసి అమ్మేసింది.
రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే. రోగుల ప్రాణాలు కాపాడడం కోసమే పనిచేయాల్సిన బ్లడ్బ్యాంకులు.. వారి ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నాయి. హైదరాబాద్లోని ఓ బ్లడ్బ్యాంక్.. కల్తీ చేసిన రక్తాన్ని సరఫరా చేసి అడ్డంగా దొరికిపోయింది. పొరపాటున ఆ రక్తాన్ని రోగికి ఎక్కించి ఉంటే.. అతడి ప్రాణాలకే ప్రమాదం సంభవించేది. వైద్యులు అప్రమత్తంగా ఉండడంతో.. బ్లడ్బ్యాంక్ అరాచకం బయటపడింది.
మలక్పేటలోని వీనస్ హాస్పిటల్లోని బ్లడ్బ్యాంక్.. ఈ ఘోరానికి పాల్పడింది. అరుదుగా లభించే ఓ నెగిటివ్ బ్లడ్లోకి.. MH గ్లూకోజ్ వాటర్ను మిక్స్ చేసి కల్తీకి పాల్పడింది. అత్యవసరంగా ఓ నెగిటివ్ రక్తం కావాలంటూ వచ్చిన రోగి బంధువులకు ఈ ప్యాకెట్ను అమ్మేసింది.
రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన నర్సింహారెడ్డి.. ఎల్బీనగర్ సాగర్ రింగ్రోడ్ సమీపంలోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలో ఓ నెగిటివ్ రక్తం లేకపోవడంతో.. మలక్పేటలోని వీనస్ హాస్పిటల్లోని బ్లడ్ బ్యాంక్లో 3 వేల రూపాయలు చెల్లించి బ్లడ్ ప్యాకెట్ తెచ్చారు. అయితే.. నర్సింహారెడ్డికి రక్తం ఎక్కించడానికి ముందు.. పరీక్షించిన అవేర్ గ్లోబల్ ఆస్పత్రి సిబ్బంది.. అందులో MH గ్లూకోజ్ వాటర్ కలిసిందంటూ తేల్చారు.
రక్తాన్ని సైతం కల్తీ చేశారని తెలుసుకుని నివ్వెరపోయిన నర్సింహారెడ్డి బంధువులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. వీనస్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్లో సోదాలు నిర్వహించారు SOT పోలీసులు. బ్లడ్బ్యాంక్ను సీజ్ చేసి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. బ్లడ్బ్యాంక్ నిర్వాహకులు డాక్టర్ చక్రవర్తి, శ్రవణ్లను అదుపులోకి ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









