చైనాలో విషాదం కొండచరియలు విరిగి 15మంది మృతి

- June 24, 2017 , by Maagulf
చైనాలో విషాదం కొండచరియలు విరిగి 15మంది మృతి

-120 మంది గల్లంతు.. చైనాలో దుర్ఘటన
చైనాలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో 15మంది మృతిచెందారు. దాదాపు 120 మంది ఆచూకీ గల్లంతయింది. వారు శిథిలాల్లో చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. ఈ సంఘటన శనివారం ఉదయం 6గంటలకు నైరుతి చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో జరిగింది. టిబెట్, కియాంగ్ పరిధిలో ఉన్న అబూ పర్వతంలోని కొంత భాగం కూలి జిన్మో గ్రామంపై పడింది. దీంతో 62 ఇండ్లు నేలమట్టమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com