సెప్టెంబర్ 21న విడుదల కానున్న 'జై లవకుశ'

- June 25, 2017 , by Maagulf
సెప్టెంబర్ 21న విడుదల కానున్న 'జై లవకుశ'

హైదరాబాద్‌: బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా, రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న జై లవకుశ విడుదల తేదీని ఖరారు చేశారు. సెప్టెంబర్ 21న సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్‌రాం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జై లవకుశలో ఎన్టీఆర్ త్రిపాత్రాభియనం చేస్తున్నారు. జులై మొదటివారంలో టీజర్ రిలీజ్ చేస్తారు. ఈమధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com