ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్లో యూఏఈ రూలర్స్
- June 25, 2017
యూఏఈ:యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్ని ఆదివారం జబీల్ మాస్క్ వద్ద నిర్వహించారు. షేక్ మొహమ్మద్తో కలిసి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా ప్రార్థనలు నిర్వహించారు. వెల్ విషర్స్ నుంచి షేక్ మొహమ్మద్ రంజాన్ శుభాకాంక్షల్ని అందుకున్నారు. జబెల్ మాస్క్ వద్ద పలువురు షేక్ మొహమ్మద్కి రంజాన్ శుభాకాంక్షలు తెలపడంతోపాటుగా, సమర్థ నాయకత్వంలో యూఏఈ మరింత ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ అక్కడికి వచ్చినవారందరికీ ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. షేక్ జాయెద్ మాస్క్లో మొహమ్మద్ బిన్ జాయెద్ - ఈద్ అల్ ఫితర్ ప్రేయర్ నిర్వహించారు. పలువురు ప్రముఖులు, అధికారులు, పౌరులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







