ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్లో యూఏఈ రూలర్స్
- June 25, 2017యూఏఈ:యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్ని ఆదివారం జబీల్ మాస్క్ వద్ద నిర్వహించారు. షేక్ మొహమ్మద్తో కలిసి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా ప్రార్థనలు నిర్వహించారు. వెల్ విషర్స్ నుంచి షేక్ మొహమ్మద్ రంజాన్ శుభాకాంక్షల్ని అందుకున్నారు. జబెల్ మాస్క్ వద్ద పలువురు షేక్ మొహమ్మద్కి రంజాన్ శుభాకాంక్షలు తెలపడంతోపాటుగా, సమర్థ నాయకత్వంలో యూఏఈ మరింత ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ అక్కడికి వచ్చినవారందరికీ ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. షేక్ జాయెద్ మాస్క్లో మొహమ్మద్ బిన్ జాయెద్ - ఈద్ అల్ ఫితర్ ప్రేయర్ నిర్వహించారు. పలువురు ప్రముఖులు, అధికారులు, పౌరులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం