ప్రధాని అమెరికా పర్యటనలో చర్చకు రాని హెచ్-1బీ వీసా
- June 27, 2017
భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపే ప్రధాన అంశాల్లో హెచ్-1బీ వీసా ఒకటి. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ట్రంప్తో భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వస్తుందని అందరూ భావించారు. అయితే, ఆ అంశం ఏదీ చర్చకు రాకపోవడం గమనార్హం. శ్వేత సౌధానికి అధిపతి ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో వీసా భయం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం చర్చకు వస్తుందని అందరూ భావించారు.
ఈ చర్చల్లో హెచ్-1బీ వీసాకు సంబంధించిన అంశమేదీ చర్చకు రాలేదని విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్ మీడియాకు వెల్లడించారు. డిజిటల్ భాగస్వామ్యం అంశం గురించి ఇరు దేశాధినేతల మధ్య చర్చ జరిగిందని చెప్పారు. ట్రంప్, మోదీ భేటీ అనంతరం ఇరు దేశాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలోనూ హెచ్-1బీ వీసా అంశం గురించి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!!
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!







