పోలీసులపై అల్లర్లు, దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష

- June 28, 2017 , by Maagulf
పోలీసులపై అల్లర్లు, దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు  జైలుశిక్ష

మనామ: కజకనాన్ లో పోలీసులపై అల్లర్లకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు  హై క్రిమినల్ కోర్టు  జైలుశిక్ష విధించింది. పోలీసు అధికారులపై వీరు వేధింపులకు పాల్పడ్డారు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి 22 వ తేదీన15 మంది అల్లరిమూకలు  హింసకు పాల్పడ్డారు. ఒక రహదారిని నిర్బంధించి  రోడ్లపై టైర్లను ఫైర్ బాంబులతో  దహనం చేశారు. అంతేకాక  ఇద్దరు ఇనుప కడ్డీలు చేతబూని పోలీసులపై దాడి చేశారు. దాడి చేస్తున్న అల్లరిమూకలను పోలీసులు ఎట్టకేలకు  అడ్డుకున్నారు .అయినప్పటికీ, ఆ సన్నివేశంలో  పోలీసు అధికారులు ముద్దాయిలకు భయపడి పారిపోకుండా నిరోధించగలిగారు. అల్లర్ల కు  పాల్పడిన నిందితుల వేలిముద్రలను సేకరించి ఆ నమూనాలతో  సరిపోల్చడం ద్వారా ఆయా నేరాలలో వారి పాత్రను ధృవీకరించబడింది. వారి కార్యసాధనను వివరిస్తూ, ముద్దాయిలలో ఒకరు పోలీసులకు ఇలా చెప్పాడు: "నేను షాబాబ్ కజ్రాజాకన్ (కజాకన్ యూత్) అనే పేరు గల వాట్సాప్  సమూహంపై ఒక సందేశాన్ని అందుకున్నాను, అల్లర్లకు పాల్పడవల్సిందిగా సమాచారం వచ్చింది. ఇందుకోసం 3:30 గంటలకు సమావేశం కావాలని కోరుతూ అందులో పేర్కొన్నారు. " నేను సమావేశం స్థలంకు చేరుకున్నాను. మేము టైర్లను రోడ్లపైకి చేర్చడం మొదలుపెట్టాము తరువాత పోలీసు అధికారులపై  దాడి చేసాము "అని మొదటి ప్రతివాది చెప్పారు. "మేము దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నప్పటికీ , ఈ ఘటనలో మేము దొరికిపోయామని పేర్కొన్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com