కిదాంబి శ్రీకాంత్ ను సన్మానించిన సీఏం చంద్ర బాబు
- June 28, 2017
అస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీష్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. వరుసగా రెండు టైటిల్స్ ను సాధించిన శ్రీకాంత్ కు వెయ్యి గజాల స్థలం రూ.50 లక్షల నగదును ఇవ్వనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. గ్రూప్1 ఉద్యోగం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
కోచ్ పుల్లెల గోపిచంద్ కు రూ. 15 లక్షల బహుమతిని ఇవ్వనున్నట్టు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శ్రీకాంత్ ను ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి బుదవారం నాడు సన్మానించారు. షటిల్ బ్యాట్ ను సీఏం కు శ్రీకాంత్ బహుమతిగా అందించారు. శ్రీకాంత్ తో చంద్రబాబునాయుడు సరదాగా షటిల్ ఆడారు. ఏపీ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన క్రీడాకారుడు అంటూ శ్రీకాంత్ ను ఆయన అభినందించారు. శ్రీకాంత్ ఇక ఏపీ తరుపున ఆడతారని చెప్పారు. విదేశీ కోచ్ ను పెట్టుకొనేందుకు కూడ అతడికి సహయం అందిస్తామన్నారు. అమరావతిలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనునన్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమం లో యువజన క్రీడా మంత్రి కొల్లు రవీంద్ర కూడా పాల్గొన్నారు
తాజా వార్తలు
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!







