భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రేసులో వెంకటేశ్ ప్రసాద్?
- June 29, 2017
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి పోటీ పెరుగుతోంది. కుంబ్లే రాజీనామా అనంతరం బీసీసీఐ మరోమారు దరఖాస్తులు ఆహ్వానించి జులై 9 గడువు తేదీగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రసాద్ జూనియర్ నేషనల్ చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరులో తన పదవి కాలం పూర్తి కానుండటంతో ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు పంపారట.
రవిశాస్త్రి, ప్రసాద్ ఇద్దరికీ టీమిండియా డైరెక్టర్లుగా పనిచేసిన అనుభవం ఉంది. 2007 నుంచి 2009 వరకు టీమిండియాకి బౌలింగ్ కోచ్గా పని చేసిన ప్రసాద్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి బౌలింగ్ కోచ్గా సేవలు అందించాడు. భారత్ తరఫున ఆయన 33 టెస్టులు, 161 వన్డేలు ఆడారు. ఇప్పటికే కోచ్ రేసులో రవిశాస్త్రి, సెహ్వాగ్, టామ్మూడీ, దొడ్డ గణేశ్, లాల్చంద్ రాజ్పుత్ ఉన్నారు. తాజాగా వెంకటేశ్ ప్రసాద్ కూడా రేసులోకి రావడంతో కోచ్ ఎంపిక ఆసక్తికరంగా సాగనుండటం ఖాయంగా కన్పిస్తోంది.
తాజా వార్తలు
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!
- వాణిజ్య శాఖ పరిధిలోకి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు..!!
- ముసందమ్లో తొమ్మిది మంది ఆసియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్ ఫిబ్రవరి ఇంధన ధరలు ఇవే..!!
- ఉక్రెయిన్లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్
- హైదరాబాద్ లో పెరుగుతున్న ఎండలు
- ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్







