రెసిడెంట్స్ కోసం ఫన్ ఫిల్డ్ వీకెండ్ ఎదురుచూస్తోంది
- June 30, 2017
దోహా ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్ (డిఇసిసి)లో సమ్మర్ ఎంటర్టైన్మెంట్ సిటీ సందర్శకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా వుంది. ప్రతి వారం కొత్తగా కనీసం రెండు షోస్తో లైవ్ ఎంటర్టైన్మెంట్ని సందర్శకులకు అందిస్తోంది. ఈ వారం బాలీవుడ్ థీమ్తో ఎంటర్టైన్మెంట్ షోస్ని ఏర్పాటు చేస్తున్నామని క్యు స్పోర్ట్స్ ఫౌండర్ మరియు సిఇఓ అదిల్ అహ్మద్ చెప్పారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆయన. ఖతార్ టూరిజంతో కలిసి క్యు స్పోర్ట్స్ నాలుగో ఎడిషన్ ఈవెంట్ని నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయి ఎంటర్టైన్మెంట్ విభాగాల్ని పరిచయం చేయడంలో క్యు స్పోర్ట్స్ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శకులకు అత్యద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఈ ఈవెంట్లో దొరుకుతుంది. ఫుడ్ కోర్ట్, అలాగే స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ ఇలా చాలా అంశాలు సందర్శకులకోసం ఎదురుచూస్తున్నాయి. అమ్యూజ్మెంట్ పార్క్ రైడ్స్, ఇంటరాక్టివ్ గేమ్స్ వంటివి కూడా కొలువుదీరాయిక్కడ.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







