కార్ తో మసీదు పై దాడి
- June 30, 2017
ఫ్రాన్స్లో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లండన్ తరహాలో ఓ వ్యక్తి వాహనంతో ఓ మసీదుపైకి దూసుకెళ్లాడు. ఆ మసీదుకు రక్షణగా ఏర్పాటుచేసి బారీగేడ్లను, కాంక్రీటు దిమ్మెలను ఢీకొట్టి మరీ ఈ చర్యకు దిగాడు. దీంతో లండన్ తరహా ఉగ్రదాడి అయ్యుంటందని పోలీసులు క్షణాల్లో అప్రమత్తమయ్యారు. అయితే, ఈ ఘటనలో ఏ ఒక్కరూ గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఢీకొట్టిన వ్యక్తి వెంటనే అందులో నుంచి దిగి పారిపోగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న ముస్లిం పెద్దలు ముమ్మాటికీ కావాలని చేసిన దాడి అని అన్నారు.
ఈ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా అది అతడి సొంతవాహనం అని తేలింది. ఉద్దేశ పూర్వకంగా చేశాడా లేక అనూహ్యం ప్రమాదవశాత్తు జరిగిందా అనే కారణాలు శోధించేందుకు పోలీసులు అతడి ఇంటిని కూడా సోదా చేశారు. ఆ వ్యక్తి 43 ఏళ్ల అమెరికన్గా గుర్తించారు. కాగా, వాహనం మసీదు వైపు దూసుకెళ్లిన సమయంలో అతడు మద్యం కూడా సేవించి లేడని తెలిసింది. దీంతో ఇప్పుడు విచారణ అధికారులంతా గందరగోళంలో పడి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లండన్లో ఇటీవల ఈ తరహా దాడులు రెండుసార్లు జరగడం, అవి తామే చేశామంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించుకోవడం జరిగిన నేపథ్యంలో ఫ్రాన్స్ దర్యాప్తు అధికారులు అదే కోణంలో అతడిని విచారించనున్నారు. అతడికి లై డిటెన్షన్ పరీక్ష కూడా చేయనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









