విశాఖలో రైలుపై విరిగిపడిన కొండచరియలు
- June 30, 2017
విశాఖపట్నంలోని కొత్తవలస- కిరండోల్ రైలు మార్గంలో శుక్రవారం కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండపై నుంచి ఓ గూడ్స్ రైలుపై కొండచరియలు విరిగిపడటంతో రైలు ఇంజిన్లు దెబ్బతిన్నాయి. శివలింగాపురం- టైడా రైల్వేస్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. దీంతో కొత్తవలస - కిరండోల్ ప్యాసింజర్ రైలును కూడా అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు. గంటల తరబడి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









