విశాఖలో రైలుపై విరిగిపడిన కొండచరియలు
- June 30, 2017
విశాఖపట్నంలోని కొత్తవలస- కిరండోల్ రైలు మార్గంలో శుక్రవారం కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండపై నుంచి ఓ గూడ్స్ రైలుపై కొండచరియలు విరిగిపడటంతో రైలు ఇంజిన్లు దెబ్బతిన్నాయి. శివలింగాపురం- టైడా రైల్వేస్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. దీంతో కొత్తవలస - కిరండోల్ ప్యాసింజర్ రైలును కూడా అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు. గంటల తరబడి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







