సినిమా టిక్కెట్ల పై నో ఎఫెక్ట్
- June 30, 2017
తెలంగాణా సినిమా ప్రేక్షకుడికో శుభవార్త ! రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు పెంచబోవడం లేదని ప్రభుత్వం ప్రకటించింది. టిక్కెట్ల రేట్లు పెంచుతూ వారం రోజుల కిందట విడుదల చేసిన జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది టీ-సర్కార్. జీఎస్టీ అమలు తర్వాత ఏర్పడే పర్యవసానాలను పరిశీలించిన తర్వాత టిక్కెట్ ధరల పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.
నేల టిక్కెట్ రూ. 40 లకు పెంచాలని, ఏసీ థియేటర్లో రూ.70 ఉన్న గరిష్ఠ టికెట్టు ధర ఒక్కసారిగా రూ.120కి పెంచాలని, మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్టుపై రూ.50 పెంపును వర్తింపజేశారు. ఆయా శ్రేణులను బట్టి టికెట్టు ధరలు రూ.200-300 మధ్యే ఉండాలని, తెరకు ముందుండే రెండు వరుసల సీట్లకు గరిష్ఠ ధరలో 20% తగ్గింపునివ్వాలని గత ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఆ జీవో ఇప్పుడు వెనక్కెళ్ళిపోవడంతో.. సినీ వర్గాలు ధియేటర్ యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
- దేశ సమగ్రత కోసం ఢిల్లీలో 'సేన ప్రస్థానం' కార్యక్రమం
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!









