సినిమా టిక్కెట్ల పై నో ఎఫెక్ట్
- June 30, 2017
తెలంగాణా సినిమా ప్రేక్షకుడికో శుభవార్త ! రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు పెంచబోవడం లేదని ప్రభుత్వం ప్రకటించింది. టిక్కెట్ల రేట్లు పెంచుతూ వారం రోజుల కిందట విడుదల చేసిన జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది టీ-సర్కార్. జీఎస్టీ అమలు తర్వాత ఏర్పడే పర్యవసానాలను పరిశీలించిన తర్వాత టిక్కెట్ ధరల పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.
నేల టిక్కెట్ రూ. 40 లకు పెంచాలని, ఏసీ థియేటర్లో రూ.70 ఉన్న గరిష్ఠ టికెట్టు ధర ఒక్కసారిగా రూ.120కి పెంచాలని, మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్టుపై రూ.50 పెంపును వర్తింపజేశారు. ఆయా శ్రేణులను బట్టి టికెట్టు ధరలు రూ.200-300 మధ్యే ఉండాలని, తెరకు ముందుండే రెండు వరుసల సీట్లకు గరిష్ఠ ధరలో 20% తగ్గింపునివ్వాలని గత ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఆ జీవో ఇప్పుడు వెనక్కెళ్ళిపోవడంతో.. సినీ వర్గాలు ధియేటర్ యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







