జీఎస్టీని లాంచ్ చేసిన ప్రణబ్, మోదీ

- June 30, 2017 , by Maagulf
జీఎస్టీని లాంచ్ చేసిన ప్రణబ్, మోదీ

దేశ పన్నుల వ్యవస్థలో పెను సంస్కరణ ఆవిష్కృతమైంది. పార్లమెంట్ సెంట్రల్హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని అర్థరాత్రి 12.01 గంటలకు జేగంట మోగించి జీఎస్టీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని దేవగౌడ, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, అనంత్కుమార్, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్నేత అడ్వాణీ, ఎన్సీపీ నేత శరద్పవార్, వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ముందుగా ప్రకటించిన విధంగానే విపక్ష పార్టీలు జీఎస్టీకి స్వాగత కార్యక్రమానికి హాజరుకాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com