విమానాశ్రయంలో డిపార్చర్ ఫారంను రద్దు చేసిన కేంద్ర హోం శాఖ
- June 30, 2017
విదేశాలకు వెళ్లే ప్రయాణికులు సర్వసాధారణంగా విమానాశ్రయాల్లో నింపే నిష్క్రమణ(డిపార్చర్) ఫారంను రద్దు చేసినట్లు కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రకటించింది. జూలై 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. విమానాల్లో విదేశాలకు వెళ్లే భారతీయులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. రైలు, రోడ్డు, నౌకల ద్వారా విదేశాలకు వేళ్లే వాళ్లు యథావిధిగా నిష్క్రమణ ఫారంను నింపాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రయాణానికి ముందు గందరగోళాన్ని, సమయం వృథాను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ తెలిపింది. ఇన్నాళ్లూ విదేశాలకు వెళ్లే ప్రయాణీకులు పేరు, అడ్రస్, జన్మదిన వివరాలతో పాటు పాన్కార్డు, విమాన వివరాలు పేర్కొన్న నిష్క్రమణ కార్డు ఫారంను సంబంధిత విమానాశ్రయ అధికారులకు ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఆ సమాచారం వేరే రూపంలో లభ్యంకావడంతో ఆ విధానాన్ని రద్దు చేసినట్లు హోం శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







