నర్గీస్ కోఫ్తా
- June 30, 2017కావలసిన పదార్థాలు:
ఉడికించిన గుడ్లు- 4, శనగపిండి- 2 టేబుల్స్పూన్లు, చికెన్- పావుకిలో, పసుపు- అర టీస్పూను, ఎండుమిర్చి- 8, ధనియాల పొడి- 1 టేబుల్స్పూను, దాల్చినచెక్క- అంగుళం ముక్క, నువ్వులు- అర టీస్పూను, వాము- పావు టీ స్పూను, యాలకులు- 2, గరం మసాలా- అర టీస్పూను, తరిగిన ఉల్లిపాయ, టమోటా- ఒక్కోటి చొప్పున, నిమ్మరసం- అర టీస్పూను, కారం- అర టేబుల్స్పూను, సోంపు పొడి- అర టీస్పూను, కొత్తిమీర, కరివేపాకు- కొద్దిగా, పచ్చిమిర్చి- రెండు, మెంతి పొడి- పావు టీస్పూను, లవంగాలు- 4, పెరుగు- పావు కప్పు, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- తగినంత.
తయారీ విధానం:
చికెన్లో ఎండుమిర్చి, దాల్చిన చెక్క, నువ్వులు, యాలకులు, వాము వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో పసుపు, శనగపిండి, ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక గుడ్లను ఈ పిండిలో ముంచి బజ్జీల్లా కాల్చుకోవాలి. తర్వాత మరో బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె పోసి వేడెక్కాక లవంగాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేగించాలి. తర్వాత టమోటాలు, మెంతి పొడి, కారం, సోంపు పొడి వేసి 5 నిమిషాలు వేగించాలి. తర్వాత పెరుగు, గరం మసాలా, నిమ్మరసం వేసి చిన్న మంట మీద మరో 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా గుడ్డు బజ్జీలు (రెండుగా మధ్యలో కోసుకుని) కూడా వేసి 2 నిమిషాలు ఉడికించి కొత్తిమీర జల్లి దించేయాలి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..