విమానాశ్రయంలో డిపార్చర్ ఫారంను రద్దు చేసిన కేంద్ర హోం శాఖ
- June 30, 2017
విదేశాలకు వెళ్లే ప్రయాణికులు సర్వసాధారణంగా విమానాశ్రయాల్లో నింపే నిష్క్రమణ(డిపార్చర్) ఫారంను రద్దు చేసినట్లు కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రకటించింది. జూలై 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. విమానాల్లో విదేశాలకు వెళ్లే భారతీయులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. రైలు, రోడ్డు, నౌకల ద్వారా విదేశాలకు వేళ్లే వాళ్లు యథావిధిగా నిష్క్రమణ ఫారంను నింపాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రయాణానికి ముందు గందరగోళాన్ని, సమయం వృథాను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ తెలిపింది. ఇన్నాళ్లూ విదేశాలకు వెళ్లే ప్రయాణీకులు పేరు, అడ్రస్, జన్మదిన వివరాలతో పాటు పాన్కార్డు, విమాన వివరాలు పేర్కొన్న నిష్క్రమణ కార్డు ఫారంను సంబంధిత విమానాశ్రయ అధికారులకు ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఆ సమాచారం వేరే రూపంలో లభ్యంకావడంతో ఆ విధానాన్ని రద్దు చేసినట్లు హోం శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









