విమానాశ్రయంలో డిపార్చర్ ఫారంను రద్దు చేసిన కేంద్ర హోం శాఖ
- June 30, 2017
విదేశాలకు వెళ్లే ప్రయాణికులు సర్వసాధారణంగా విమానాశ్రయాల్లో నింపే నిష్క్రమణ(డిపార్చర్) ఫారంను రద్దు చేసినట్లు కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రకటించింది. జూలై 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. విమానాల్లో విదేశాలకు వెళ్లే భారతీయులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. రైలు, రోడ్డు, నౌకల ద్వారా విదేశాలకు వేళ్లే వాళ్లు యథావిధిగా నిష్క్రమణ ఫారంను నింపాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రయాణానికి ముందు గందరగోళాన్ని, సమయం వృథాను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ తెలిపింది. ఇన్నాళ్లూ విదేశాలకు వెళ్లే ప్రయాణీకులు పేరు, అడ్రస్, జన్మదిన వివరాలతో పాటు పాన్కార్డు, విమాన వివరాలు పేర్కొన్న నిష్క్రమణ కార్డు ఫారంను సంబంధిత విమానాశ్రయ అధికారులకు ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఆ సమాచారం వేరే రూపంలో లభ్యంకావడంతో ఆ విధానాన్ని రద్దు చేసినట్లు హోం శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!









