విమానాశ్రయంలో డిపార్చర్ ఫారంను రద్దు చేసిన కేంద్ర హోం శాఖ
- June 30, 2017
విదేశాలకు వెళ్లే ప్రయాణికులు సర్వసాధారణంగా విమానాశ్రయాల్లో నింపే నిష్క్రమణ(డిపార్చర్) ఫారంను రద్దు చేసినట్లు కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రకటించింది. జూలై 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. విమానాల్లో విదేశాలకు వెళ్లే భారతీయులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. రైలు, రోడ్డు, నౌకల ద్వారా విదేశాలకు వేళ్లే వాళ్లు యథావిధిగా నిష్క్రమణ ఫారంను నింపాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రయాణానికి ముందు గందరగోళాన్ని, సమయం వృథాను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ తెలిపింది. ఇన్నాళ్లూ విదేశాలకు వెళ్లే ప్రయాణీకులు పేరు, అడ్రస్, జన్మదిన వివరాలతో పాటు పాన్కార్డు, విమాన వివరాలు పేర్కొన్న నిష్క్రమణ కార్డు ఫారంను సంబంధిత విమానాశ్రయ అధికారులకు ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఆ సమాచారం వేరే రూపంలో లభ్యంకావడంతో ఆ విధానాన్ని రద్దు చేసినట్లు హోం శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







