అమెరికా న్యూజెర్సీలో మరో 'షిరిడీ'
- July 03, 2017షిరిడీలో సాయిబాబా మహా సంస్థానం మాదిరి ఆలయం అమెరికాలోని న్యూజెర్సీలోనూ ఏర్పాటు కానుంది. విజయవాడలోని స్టెల్లా కళాశాల వద్ద సాయిబాబా ఆలయంలో ప్రధానార్చకుడిగా పనిచేసిన గుంటూరు జిల్లాకు చెందిన శంకరమంచి రవిశర్మ.. ఆయన కొంతకాలం క్రితం అమెరికాకు వెళ్లారు. న్యూజెర్సీలోని సాయిబాబా ఆలయంలో పనిచేసిన రవిశర్మ అక్కడ షిరిడీలోని బాబా ఆలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఇందుకోసం 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. షిరిడీలో ఉన్నట్టుగా ఆలయాన్ని, గోశాలను, చావడి, ద్వారకామాయి, కల్యాణ మండపం, శివాలయం, గురుకుల వేదశాలను నిర్మించడానికి రూ.100కోట్లు వ్యయమవుతుంది. దీన్ని ఒక్కో భక్తుడి నుంచి రూ.713.99ల చొప్పున (11 డాలర్లు) చొప్పున 1,111,111మంది భక్తుల ఇళ్లలో సాయిబాబా పాదుకలతో పూజ నిర్వహించి అవసరమైన విరాళాన్ని సేకరించారు. విజయదశమి రోజున భూమి పూజ చేయాలని నిర్ణయించామని తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ