భారత్ ఖాతాలో తొలి స్వర్ణం

- July 06, 2017 , by Maagulf
భారత్ ఖాతాలో తొలి స్వర్ణం

ఒడిశాలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ భారత్ తొలి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన వుమెన్స్ షాట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ స్వర్ణపతకాన్ని సాధించింది. పురుషుల షాట్పుట్లో వికాస్ గౌడ కాంస్య పతకాన్ని సాధించాడు. భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ప్రారంభమైన విషయం తెలిసిందే. 44 దేశాలకు చెందిన 800 మందికి పైగా అగ్రశ్రేణి అథ్లెట్లు ఈ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి 95 మంది అథ్లెట్లు(49 మంది పురుషులు, 46 మంది మహిళలు) ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు భారత్ ముచ్చటగా మూడోసారి ఆతిథ్యమిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com