భారతీయ ప్రయాణికులకు అమెరికా ప్రయాణం ఇక సులభతరం
- July 09, 2017
ఎట్టకేలకు భారతీయ ప్రయాణికులకు అమెరికా కాస్త వెసులుబాటు నిచ్చింది. ఇతర దేశాల పౌరులు ఎక్కువ తనిఖీలు లేకుండా తేలికగా అమెరికాలో అడుగుబపెట్టడానికి అనుమతించే 'గ్లోబల్ ఎంట్రీ' అర్హతను భారతీయులకు కూడా కల్పిస్తున్నట్టు అమెరికా ఇటీవల ప్రకటించింది. ముందే అనుమతి పొందిన, ముప్పు కలిగించే అవకాశం లేని ప్రయాణికులు సులువుగా అమెరికాలో ప్రవేశించడానికి వీలుగా కస్టమ్స్, సరిహద్దు రక్షణ విభాగం (సీబీపీ) గ్లోబల్ ఎంట్రీని గతంలో రూపొందించింది. ప్రస్తుతం 53 అమెరికా విమానాశ్రయాల్లో ఈ గ్లోబల్ ఎంట్రీ ఆటోమేటెడ్ కియోస్క్లు పనిచేస్తున్నాయి. భారత్కు సులభ ప్రవేశం కల్గించిన అమెరికా పాక్ను, చైనాను రష్యాను కూడా పక్కన బెట్టడం గమనార్హం.
అమెరికా హోం లాండ్ సెక్యూరిటీ శాఖలో భాగమైన సీబీపీ తాజా నిర్ణయం ఫలితంగా ఇక నుంచి భారతీయులు గ్లోబల్ ఎంట్రీ సౌకర్యం కోసం గ్లోబల్ ఆన్లైన్ ఎన్రోల్మెంట్ సిస్టం(గోస్) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తాజా నిర్ణయంతో గ్లోబల్ ఎంట్రీ అవకాశం లభించిన పదకొండో దేశంగా భారత్ ఆవిర్భవించింది. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న నవతేజ్సింగ్ సర్నా ఈ విధానంలో పేరు నమోదు చేయించుకున్న తొలి భారతీయుడయ్యారు. ఇప్పటికే అమెరికాతోపాటు 10 ఇతర దేశాలకు చెందిన 40 లక్షల మంది గ్లోబల్ ఎంట్రీ సభ్యులుగా చేరారు. అమెరికా విమానాశ్రయాల్లో వారు సంప్రదాయ సీపీబీ తనిఖీ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ఆటోమేటెడ్ కియోస్క్(గది)కు వెళ్లి తమ గుర్తింపు కార్డులను నిమిషాల్లో తనిఖీ చేయించుకుని అమెరికా నగరాల్లోకి ప్రవేశించవచ్చు.
గ్లోబల్ ఎంట్రీ సభ్యులు అమెరికా రవాణా భద్రత విభాగం అందించే ప్రత్యేక స్క్రీనింగ్ సౌకర్యం కూడా పొందవచ్చు. అమెరికాతో సన్నిహిత సంబంధాలున్న అర్జెంటీనా, కొలంబియా, జర్మనీ, మెక్సికో, నెదర్లాండ్స్, పనామా, దక్షిణ కొరియా, సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిటన్ దేశాల పౌరులకు ఇప్పటికే గ్లోబల్ ఎంట్రీ అర్హతకు అనుమతి ఇచ్చారు. తాజాగా భారత్ ఈ జాబితాలో చేరింది. 11 దేశాలతోపాటు అమెరికా పౌరులు, జాతీయులు, చట్టబద్ధమైన శాశ్వత వాసులు కూడా గ్లోబల్ ఎంట్రీలో సభ్యత్వం తీసుకోవడానికి అర్హులే. అలాగే, నెక్సస్ ప్రోగ్రాంలో నమోదైన కెనడా పౌరులు, నివాసులు కూడా గ్లోబల్ ఎంట్రీకి దరఖాస్తుచేసుకోవచ్చు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







