బ్రిటన్ రాజధానిలండన్లో మరోసారి భారీ అగ్నిప్రమాదం
- July 09, 2017
బ్రిటన్ రాజధానిలండన్లోని క్యామ్డెన్ లాక్ మార్కెట్లో ఆదివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న 70 మంది అగ్నిమాపక సిబ్బంది, పది అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఓ భవనంలోని మూడు అంతస్థుల్లో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. క్యామ్డెన్ మార్కెట్ ఉత్తర లండన్లోనే ప్రముఖ పర్యాటక స్థలంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. సమయానికి మంటలు అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పిందని.. ఆలస్యమైతే పక్కనున్న రెస్టారెంట్లకు కూడా మంటలు వ్యాపించేవని చెప్పారు. జూన్లో వెస్ట్ లండన్లోని గ్రెన్ఫెల్ టవర్లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









