మితిమీరిన మద్యం సేవించడం: వ్యక్తి మృతి
- July 13, 2017
మనామా: హమాద్ టౌన్లో ఓ వ్యక్తి అధిక మోతాదులో ఆల్కహాల్ సేవించి ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై నగ్నంగా ఆ వ్యక్తి పడి ఉన్నాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. హమాద్ టౌన్లో మధ్యాహ్నం వేళ ఓ వ్యక్తి తన వాహనాన్ని నడుపుతూ ఉండగా, అక్కడ మృతుడ్ని గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చాడు. మృతదేహానికి పక్కనే ఆల్కహాలిక్ బెవరేజెస్కి చెందిన క్యాన్స్ని పోలీసులు గుర్తించారు. పోలీస్ వాహనం, అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. 40 డిగ్రీలకు మించిన ఎండ ఉన్న సమయంలో, రోడ్డుపై నగ్నంగా ఆ వ్యక్తి ఎందుకు పడి ఉన్నాడన్నదానిపై విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









