మితిమీరిన మద్యం సేవించడం: వ్యక్తి మృతి
- July 13, 2017
మనామా: హమాద్ టౌన్లో ఓ వ్యక్తి అధిక మోతాదులో ఆల్కహాల్ సేవించి ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై నగ్నంగా ఆ వ్యక్తి పడి ఉన్నాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. హమాద్ టౌన్లో మధ్యాహ్నం వేళ ఓ వ్యక్తి తన వాహనాన్ని నడుపుతూ ఉండగా, అక్కడ మృతుడ్ని గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చాడు. మృతదేహానికి పక్కనే ఆల్కహాలిక్ బెవరేజెస్కి చెందిన క్యాన్స్ని పోలీసులు గుర్తించారు. పోలీస్ వాహనం, అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. 40 డిగ్రీలకు మించిన ఎండ ఉన్న సమయంలో, రోడ్డుపై నగ్నంగా ఆ వ్యక్తి ఎందుకు పడి ఉన్నాడన్నదానిపై విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!









