మితిమీరిన మద్యం సేవించడం: వ్యక్తి మృతి
- July 13, 2017
మనామా: హమాద్ టౌన్లో ఓ వ్యక్తి అధిక మోతాదులో ఆల్కహాల్ సేవించి ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై నగ్నంగా ఆ వ్యక్తి పడి ఉన్నాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. హమాద్ టౌన్లో మధ్యాహ్నం వేళ ఓ వ్యక్తి తన వాహనాన్ని నడుపుతూ ఉండగా, అక్కడ మృతుడ్ని గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చాడు. మృతదేహానికి పక్కనే ఆల్కహాలిక్ బెవరేజెస్కి చెందిన క్యాన్స్ని పోలీసులు గుర్తించారు. పోలీస్ వాహనం, అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. 40 డిగ్రీలకు మించిన ఎండ ఉన్న సమయంలో, రోడ్డుపై నగ్నంగా ఆ వ్యక్తి ఎందుకు పడి ఉన్నాడన్నదానిపై విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







