విజయవాడలో ఒక మల్టీప్లెక్క్స్ ను నిర్మించనున్నారు

- October 19, 2015 , by Maagulf
విజయవాడలో ఒక  మల్టీప్లెక్క్స్ ను నిర్మించనున్నారు

ప్రసాద్'స్ గ్రూప్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ వారు కలసి విజయవాడలో ఒక మల్టీప్లెక్క్స్ ను నిర్మించనున్నారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమo, ఈ ఉదయం ఆంధ్ర ప్రదేస్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభింపబడింది. ప్రముఖ తెలుగు హీరోలు వెంకటేష్, రాణా లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆహూతులను అలరించారు. విజయవాడ ప్రాంతానికి తాలమానికంగా, ప్రపంచంలోనే అతి ఉత్తమమైనదిగా చెప్పబడే క్యాపిటల్ సినేమా, నిలుస్తుందనడంలో సందేహం లేదు.90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఏడు అతిపెద్ద స్క్రీన్లతో, 2-డి, 3-డి మరియు 4-డి సినేమా అనుభూతిని అందించనున్నాయి.  2000 మందికి సరిపడా సీటింగ్ సదుపాయం లభించడం ఇక్కడి అనేక ప్రత్యేకతలలో ఒకటి.  ఇక్కడ ఆరో మరియు 4కె ప్రోజెక్షన్ సదుపాయం కూడా ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com