సైదాబాద్కు చెందిన వెంకటమ్మను వీసాతో దుబాయ్ తీసుకెళ్లారు...చిత్రహింసలు పెట్టారు
- July 17, 2017
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
నకిలీ కన్సెల్టెన్సీలతో నిరుద్యోగులకు గాలం
ఇద్దరి అరెస్టు.. పరారీలో ముగ్గురు
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకులను మోసగిస్తున్న ఇద్దరు దళారులను సోమవారం అరెస్ట్ చేసినట్లు టాస్క్ఫోర్స్ డీసీపీ బి.లింబారెడ్డి తెలిపారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన రాజు(46), మహ్మద్ షౌకత్ అలీ (40), నసీర్ స్నేహితులు. ముంబైకు చెందిన సలీం అక్కడే గోల్డెన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కన్సల్టెన్సీ ఏర్పాటుచేశారు. దుబాయ్, సౌది ఆరేబియా దేశాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ప్రచారం చేసేవాడు. ముగ్గురు స్నేహితులను సలీం ఏజెంట్లుగా నియమించకున్నాడు. వారి ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో ప్రచారం చేయించాడు. పాస్పోర్ట్, వీసా ఖర్చుల కోసమంటూ ఒక్కొకరి నుంచి రూ. 90 వేల నుంచి రూ1.20 లక్ష వరకు వసూలు చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సైదాబాద్కు చెందిన వెంకటమ్మ అనే మహిళను వర్క్ వీసాతో దుబాయ్ పంపించారు. అక్కడికి వెళ్లేముందు మంచి ఉద్యోగం, వసతి ఉండే విధంగా ఉద్యోగం ఇప్పిస్తామని పంపించారని, అక్కడికి వెళ్లిన తర్వాత రోజే చిత్రహింసలు పెడుతున్నారని తన భర్తకు ఫోన్ ద్వారా ఆమె సమాచారం అందించింది. వెంకటమ్మ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ కన్సెల్టెన్సీ బాగోతం వెలుగులోకి వచ్చింది. రాజు, షౌకత్ అలీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి వారి వద్ద నుంచి 3 పాస్పోర్టులు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
మల్లెపల్లికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖుద్దుస్, నసీర్, ముంబాయికి చెందిన సలీమ్ పరారీలో ఉన్నట్లు డీసీపీ లింబారెడ్డి పేర్కొన్నారు. నిందితులను సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. టాస్క్ఫోర్స్ తనిఖీల్లో ఇన్స్పెక్టర్ ఎస్.మోహన్కుమార్, ఎస్సైలు ఎ.సుధాకర్, కె.శ్రీనివాస్, ఎస్.సైదాబాబు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









