రాజధాని అమరావతి శంకుస్థాపనకు హెలికాప్టర్లో కేసీఆర్

- October 19, 2015 , by Maagulf
రాజధాని అమరావతి శంకుస్థాపనకు హెలికాప్టర్లో కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 22వ తేదీన హెలికాప్టర్లో వెళ్లనున్నారు. తొలుత రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలనుకున్న కేసీఆర్ కు, ఆ రోజు శంకుస్థాపన రీత్యా రోడ్లు రద్దీగా ఉంటాయని అధికారులు చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని మానుకుని హెలికాప్టర్లో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఐతే సూర్యాపేట వరకూ రోడ్డు మార్గంలో వస్తారని సమాచారం. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ ప్రయాణం చేస్తారని తెలుస్తోంది. అమరావతి రాజధాని శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ఆహ్వానించారు. కాగా ఈ శంకుస్థాపన కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా జరుగనుంది. శంకుస్థాపనకు లక్షల్లో ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకుగాను అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com