రీమేక్ మీద మనసుపడ్డ జూనియర్ ఎన్టీఆర్
- July 22, 2017
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ తరువాత చేయబోయే సినిమాను ఇంత వరకు ప్రకటించలేదు. సినిమాతో పాటు తొలిసారిగా బుల్లితెర ఎంట్రీ ఇస్తూ బిగ్ బాస్ షో కూడా చేస్తున్నాడు జూనియర్. ఈ రెండు ప్రాజెక్ట్ ల తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటీ అన్న చర్చ మొదలైంది. స్టార్ డైరెక్టర్లు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నారు. జూనియర్ మాత్రం ఇంత వరకు ఏ ప్రాజెక్ట్ ను కన్ఫామ్ చేయలేదు.
రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి టాప్ డైరెక్టర్స్ తో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది. కన్నడలో సూపర్ హిట్ అయిన రాజ కుమార సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు ఎన్టీఆర్. ఇటీవల విడుదలైన ఈ సినిమా సాండల్ వుడ్ లో ఘనవిజయం సాధించింది.
ఎన్టీఆర్ స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన రాజ కుమార అక్కడ అత్యథిక సెంటర్లలో శతదినోత్సవం జరుపుకున్న సినిమాగా రికార్డ్ సృష్టించింది. పునీత్ స్వయంగా రాజ కుమార రీమేక్ గురించి ఎన్టీఆర్ తో చర్చించాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. రాజ కుమార రీమేక్ పై ఎన్టీఆర్ గట్టిగానే ఆలోచిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







