ప్రయాణంలో 3000 కువైట్ దినార్ల కంటే ఎక్కువ తీసుకెళితే ఆ మొత్తాన్ని ప్రకటించండి
- July 23, 2017
కువైట్ : ప్రయాణంలో 3000 కువైట్ దినార్ల కంటే ఎక్కువ తమ వెంట తీసుకెళితే ఆ మొత్తాన్ని ప్రకటించండని డైరెక్టర్ జనరల్ జమాల్ అల్-జలావీ ప్రయాణికులను కోరారు. 3000 కువైట్ దినార్ల కంటే ఎక్కువ మొత్తాన్ని తరలిస్తే , వారి రాక పోకల సమయంలో తరువాత చట్టం 106/4 ప్రకారం అధికారులకు విధిగా తెలియచేయాలని ఆయన కోరారు. . పౌరులు మరియు నివాసితులు డబ్బు తరలించడం నేరమైతే కాదు కానీ ఎంత మొత్తంలో తీసుకెళుతున్నారో తెలియచేయాలని వారి డబ్బుపై కువైట్ తరఫునుంచి ఎలాంటి పరిమితి లేదని ఆయన ప్రకటించారు. కువైట్ అక్రమనగదు బదిలీపై పోరాడటానికి కఠినమైన చట్టం అమలువుతుంది. అంతేకాక , ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వేరే అపరిచితులు విమానాశ్రయాలలో తమ సామానులు కాస్తంత పట్టుకోండని అడిగితే సహాయం చేయవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. నిషేధిత పదార్ధాలను తరలించేవారు తోటి ప్రయాణికులతో ఇలా వ్యవహరిస్తారని అన్నారు. ఒకవేళ ఎవరైనా అమాయకంగా వారి సన్నులు తీసుకొంటే..పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పుడు నేరస్తునితో పాటు ఆ ప్రయాణికుడికి శిక్ష తప్పదని అన్నారు.నిషేధిత వస్తువుల జాబితా గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయాణీకులు కస్టమ్స్ డిపార్ట్మెంట్ లేదా దాని పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ను సందర్శించాలని సిఫారసు చేసారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







