ప్రయాణంలో 3000 కువైట్ దినార్ల కంటే ఎక్కువ తీసుకెళితే ఆ మొత్తాన్ని ప్రకటించండి
- July 23, 2017
కువైట్ : ప్రయాణంలో 3000 కువైట్ దినార్ల కంటే ఎక్కువ తమ వెంట తీసుకెళితే ఆ మొత్తాన్ని ప్రకటించండని డైరెక్టర్ జనరల్ జమాల్ అల్-జలావీ ప్రయాణికులను కోరారు. 3000 కువైట్ దినార్ల కంటే ఎక్కువ మొత్తాన్ని తరలిస్తే , వారి రాక పోకల సమయంలో తరువాత చట్టం 106/4 ప్రకారం అధికారులకు విధిగా తెలియచేయాలని ఆయన కోరారు. . పౌరులు మరియు నివాసితులు డబ్బు తరలించడం నేరమైతే కాదు కానీ ఎంత మొత్తంలో తీసుకెళుతున్నారో తెలియచేయాలని వారి డబ్బుపై కువైట్ తరఫునుంచి ఎలాంటి పరిమితి లేదని ఆయన ప్రకటించారు. కువైట్ అక్రమనగదు బదిలీపై పోరాడటానికి కఠినమైన చట్టం అమలువుతుంది. అంతేకాక , ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వేరే అపరిచితులు విమానాశ్రయాలలో తమ సామానులు కాస్తంత పట్టుకోండని అడిగితే సహాయం చేయవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. నిషేధిత పదార్ధాలను తరలించేవారు తోటి ప్రయాణికులతో ఇలా వ్యవహరిస్తారని అన్నారు. ఒకవేళ ఎవరైనా అమాయకంగా వారి సన్నులు తీసుకొంటే..పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పుడు నేరస్తునితో పాటు ఆ ప్రయాణికుడికి శిక్ష తప్పదని అన్నారు.నిషేధిత వస్తువుల జాబితా గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయాణీకులు కస్టమ్స్ డిపార్ట్మెంట్ లేదా దాని పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ను సందర్శించాలని సిఫారసు చేసారు.
తాజా వార్తలు
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!









