ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్లో ఆత్మాహుతి దాడి, 12 మంది మృతి
- July 24, 2017
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు మరోసారి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పీడీ3లోని గులే ఆసుపత్రి ప్రాంతంలో సోమవారం నాడు కారుబాంబుతో ఆత్మాహుతికి పాల్పడ్డారు.ఈ ఘటనలో 12మంది చనిపోయారు.మరో 10 మంది గాయపడ్డారు.
ప్రముఖ రాజకీయనాయుడు మహ్మద్ మోహఖిక్ ఇంటికి సమీపంలో కారుబాంబుతో ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 12 మంది చనిపోయారు. పలువురు గాయపడినట్టు సమాచారం.
ఈఘటనను ఆఫ్గాన్ హోంమంత్రిత్వశాఖ నజీబ్ దానిశ్ ధృవీకరించారు. కీలక రాజకీయ నాయకుల నివాసాలు ఉన్న చోట పేలుడు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అయితే ఈ దాడికి ఎవరూ పాల్పడ్డారనేది ఇంతవరకు ఎవరు ప్రకటించలేదు. తాలిబన్లు తరచూ ఈ రకమైన దాడులకు దిగుతుంటారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







