ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్లో ఆత్మాహుతి దాడి, 12 మంది మృతి
- July 24, 2017
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు మరోసారి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పీడీ3లోని గులే ఆసుపత్రి ప్రాంతంలో సోమవారం నాడు కారుబాంబుతో ఆత్మాహుతికి పాల్పడ్డారు.ఈ ఘటనలో 12మంది చనిపోయారు.మరో 10 మంది గాయపడ్డారు.
ప్రముఖ రాజకీయనాయుడు మహ్మద్ మోహఖిక్ ఇంటికి సమీపంలో కారుబాంబుతో ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 12 మంది చనిపోయారు. పలువురు గాయపడినట్టు సమాచారం.
ఈఘటనను ఆఫ్గాన్ హోంమంత్రిత్వశాఖ నజీబ్ దానిశ్ ధృవీకరించారు. కీలక రాజకీయ నాయకుల నివాసాలు ఉన్న చోట పేలుడు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అయితే ఈ దాడికి ఎవరూ పాల్పడ్డారనేది ఇంతవరకు ఎవరు ప్రకటించలేదు. తాలిబన్లు తరచూ ఈ రకమైన దాడులకు దిగుతుంటారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









