ఎండవేడిమితో దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ సిటీ కమ్యూటర్స్‌ ఇబ్బందులు

- July 24, 2017 , by Maagulf
ఎండవేడిమితో దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ సిటీ కమ్యూటర్స్‌ ఇబ్బందులు

 ఇంటర్నేషనల్‌ సిటీ కమ్యూటర్స్‌, ఎండ వేడిమికి తాళలేకపోతున్నామంటున్నారు. తమ ప్రాంతంలో బస్‌ షెల్టర్స్‌ ఉన్నా, అవి ఎండ వేడిమి నుంచి రక్షణ ఇవ్వలేకపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్‌ సిటీలో 60,000 మంది వరకూ నివసిస్తున్నారు. వీరికి రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) బస్సులే ముఖ్యమైన రవాణా సాధనాలు. ఎండ వేడిమి 40 డిగ్రీలు దాటితే తమ ఆరోగ్య పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతోందని ప్రయాణీకులు వాపోయారు. కవర్‌ చేసి ఉన్న ఏసీ బస్‌ స్టాప్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా ఇంటర్నేషనల్‌ సిటీ కమ్యూటర్స్‌ అభ్యర్థిస్తున్నారు. అయితే సమస్యను గుర్తించామనీ, నఖీల్‌తో కలిసి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌టిఎ అధికార ప్రతినిథి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com