ఎన్నారైలకు ఆదాయపు పన్నుపై ఇండియా క్లారిటీ
- July 26, 2017
దుబాయ్: ఎన్నారైలు ఇంకమ్ ట్యాక్స్ రిఫండ్స్ కోసం దర్యాప్తు చేసుకోవాల్సి వస్తే, భారతదేశంలో బ్యాంక్ అకౌంట్ లేనివారు ఏం చేయాలన్నదానిపై భారత ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది. తమకున్న విదేశీ బ్యాంకు అకౌంట్ వివరాల్ని పేర్కొంటూ అప్లికేషన్ పూర్తి చేస్తే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇంకమ్ ట్యాక్స్ రిటర్న్ ఫామ్స్ ఫర్ ది అస్సెస్మెంట్స్ ఇయర్ 2017-18 మార్చి 30 నోటిఫై చేయబడిందని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ తర్వాతి నుంచి పెద్ద సంఖ్యలో ఎన్నారైలనుంచి ఆదాయపు పన్ను విషయమై అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో బ్యాంక్ అకౌంట్ లేని తమకు రిఫండ్స్ ఎలా వస్తాయని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నారైల కోసం విదేశాల్లోని తమ అక్కౌంట్ల వివరాలు తెలిపితే సరిపోతుందని కేంద్రం స్పష్టతనివ్వడం జరిగింది. ఈ నిర్ణయం ఆహ్వానించదగ్గదని దుబాయ్లో ఇండియా కాన్సుల్ జనరల్ విపుల్ చెప్పారు. దుబాయ్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ అనీష్ మెహతా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత ఆహ్వానించదగ్గదని చెప్పారు.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









