అల్ అక్సా మసీదు ఆవరణలో ఇజ్రాయిల్ యూదీకరణ
- July 27, 2017
- అడ్డుకునేందుకు తక్షణ జోక్యం
- ప్రపంచ దేశాలకు హమాస్ పిలుపు
జెరూ సలేమ్ పాత నగరంలోని అల్ అక్సా మసీదు ఆవరణలో ఇజ్రాయిల్ ప్రభుత్వం అనుసరిస్తున్న యూదీకరణ విధానాలను అడ్డుకునేందుకు తక్షణ జోక్యం చేసుకోవాలని పాలస్తీనాకు చెందిన హమాస్ ప్రతిఘటనోద్యమ సంస్థ ముస్లిం దేశాలతో పాటు, ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఈ పవిత్ర స్థలంలో తాజాగా యధాతథ స్థితిని కొనసాగించేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోందని హమాస్ ప్రతినిధి హుసామ్ బద్రన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మసీదు సింహద్వారం వద్ద వున్న చారిత్రక శిలా ఫలకాలను, అరబిక్ భాషలో వున్న నామ ఫలకాన్ని ఇజ్రాయిల్ తొలగించటాన్ని ఈ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ముస్లింల పవిత్ర స్థలాలను, ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు జెరూసలేమ్ అల్ కుడ్స్లో నివసిస్తున్న పాలస్తీనా యువత గణనీయమైన త్యాగాలు చేసిందన్నారు. ఈ త్యాగ ఫలాలను సాధ్యమైనంత మేర కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని బద్రన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అల్ మక్సా మసీదు ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లను మంగళవారం తొలగించిన ఇజ్రాయిల్ ప్రభుత్వం, మసీదులోకి వచ్చి వెళ్లే ముస్లిం భక్తులను పరిశీలించేందుకు నిఘా కెమెరాలను మాత్రం ఇంకా కొనసాగిస్తూనే వుంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







