విదేశీ విద్యకు ప్రభుత్వ సాయం:కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ
- July 27, 2017
నిత్యం కాపులకు అండగా ఉంటున్న సీఎం చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు చెప్పాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసే స్థోమత లేని విద్యార్థులకు టీడీపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని వివరించారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఎన్టీఆర్ విదేశీ విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వెయ్యి మంది విద్యార్థులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికోసం రూ.51.83 కోట్లు కేటాయించామని చెప్పారు. 2017-18కి గాను గురువారం 90మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







