విదేశీ విద్యకు ప్రభుత్వ సాయం:కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ
- July 27, 2017
నిత్యం కాపులకు అండగా ఉంటున్న సీఎం చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు చెప్పాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసే స్థోమత లేని విద్యార్థులకు టీడీపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని వివరించారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఎన్టీఆర్ విదేశీ విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వెయ్యి మంది విద్యార్థులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికోసం రూ.51.83 కోట్లు కేటాయించామని చెప్పారు. 2017-18కి గాను గురువారం 90మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









