విదేశీ విద్యకు ప్రభుత్వ సాయం:కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ
- July 27, 2017
నిత్యం కాపులకు అండగా ఉంటున్న సీఎం చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు చెప్పాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసే స్థోమత లేని విద్యార్థులకు టీడీపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని వివరించారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఎన్టీఆర్ విదేశీ విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వెయ్యి మంది విద్యార్థులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికోసం రూ.51.83 కోట్లు కేటాయించామని చెప్పారు. 2017-18కి గాను గురువారం 90మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









