విదేశీ విద్యకు ప్రభుత్వ సాయం:కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయ

- July 27, 2017 , by Maagulf
విదేశీ విద్యకు ప్రభుత్వ సాయం:కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయ

నిత్యం కాపులకు అండగా ఉంటున్న సీఎం చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు చెప్పాలని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసే స్థోమత లేని విద్యార్థులకు టీడీపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని వివరించారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వెయ్యి మంది విద్యార్థులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికోసం రూ.51.83 కోట్లు కేటాయించామని చెప్పారు. 2017-18కి గాను గురువారం 90మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com