పాకిస్తాన్ ప్రధాని షరీఫ్కు పదవి గండం.. కీలక తీర్పు నేడే
- July 28, 2017
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భవితవ్యం నేడు తేలనుంది. పనామా పేపర్ల ద్వారా బయటకొచ్చిన ఆయన కుంభకోణం కేసుకు సంబంధించి పాక్ సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనుంది. 11:30గంటల ప్రాంతంలో కోర్టు షరీఫ్ ఆయన కుటుంబ సభ్యులపై తీర్పు ఇవ్వనున్నట్లు పాక్ మీడియా వర్గాలు తెలిపాయి.
ఇది వరకే రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన షరీఫ్ 1990లో పెద్ద మొత్తంలో కుంభకోణానికి పాల్పడ్డారని, అక్రమంగా వెనుకేసుకున్న సొమ్ముతో లండన్లో పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోళ్లు చేశారని, పలువురు బినామీల పేరిట, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు కొనుగోళ్లు చేశారని పనామా రహస్య పేపర్ల లీకేజీ ద్వారా బయటపడింది. దీంతో పాక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం, షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై విచారణ చేస్తూ కోర్టుకు నివేదిక సమర్పించింది. దీనిపై నేడు కీలక తీర్పును కోర్టు ఇవ్వనుంది. ఒక వేళ షరీఫ్ నిజంగానే తప్పు చేసినట్లు తీర్పు వెలువరిస్తే ఆయన వెంటనే ప్రధాని పదవిగా అర్హత కోల్పోవడంతోపాటు జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







