ఆగస్ట్ 1 నుంచి భారతీయ కార్మికులకు మేలైన ఇన్స్యూరెన్స్ కవరేజ్
- July 28, 2017
దుబాయ్: ఆగస్ట్ 1 నుంచి ఇండియన్ బ్లూ కాలర్ వర్కర్స్కి బెటర్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ అందనుంది. ఇందుకుగాను, తప్పనిసరి ఇన్స్యూరెన్స్ స్కీమ్ని మరింత సరళతరం చేసింది భారత ప్రభుత్వం. ప్రవాసీ భారతీయభీమా యోజనా (పిబిబివై) పేరుతో రూపొందించిన ఈ స్కీమ్ 18 దేశాల్లో పనిచేస్తోన్న భారతీయ కార్మికులకు ఉపయోగకరంగా మారనుంది. ఆగస్ట్ 1 నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుందని దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ పేర్కొంది. యూఏఈలో 2.8 మిలియన్ భారతీయులు బ్లూ కాలర్ వర్కర్స్గా పనిచేస్తున్నారు. గతంలో ఇన్స్యూరెన్స్కి సంబంధించి కొన్ని నిబంధనలు కఠినతరంగా ఉండేవనీ, ఆ కారణంగా కార్మికులు ఇన్స్యూరెన్స్ సౌకర్యం వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారనీ, వాటన్నిటినీ సరళతరం చేయడంతోపాటుగా మరింత మెరుగ్గా ఇన్స్యూరెన్స్ సేవలు అందించేలా మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్లో రెన్యువల్ చేసుకోవడం, శాశ్వత వైకల్యం, యాక్సిడెంటల్ డెత్ వంటివాటిని ఇన్స్యూరెన్స్ పరిధిలోకి తీసుకురావడం, 75,000 నుంచి 1,00,000 రూపాయల వరకు హాస్పిటలైజేషన్ కవరేజీ, వంటివి ఈ కొత్త స్కీమ్ ప్రత్యేకతలు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







