ఆగస్ట్ 1 నుంచి భారతీయ కార్మికులకు మేలైన ఇన్స్యూరెన్స్ కవరేజ్
- July 28, 2017
దుబాయ్: ఆగస్ట్ 1 నుంచి ఇండియన్ బ్లూ కాలర్ వర్కర్స్కి బెటర్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ అందనుంది. ఇందుకుగాను, తప్పనిసరి ఇన్స్యూరెన్స్ స్కీమ్ని మరింత సరళతరం చేసింది భారత ప్రభుత్వం. ప్రవాసీ భారతీయభీమా యోజనా (పిబిబివై) పేరుతో రూపొందించిన ఈ స్కీమ్ 18 దేశాల్లో పనిచేస్తోన్న భారతీయ కార్మికులకు ఉపయోగకరంగా మారనుంది. ఆగస్ట్ 1 నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుందని దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ పేర్కొంది. యూఏఈలో 2.8 మిలియన్ భారతీయులు బ్లూ కాలర్ వర్కర్స్గా పనిచేస్తున్నారు. గతంలో ఇన్స్యూరెన్స్కి సంబంధించి కొన్ని నిబంధనలు కఠినతరంగా ఉండేవనీ, ఆ కారణంగా కార్మికులు ఇన్స్యూరెన్స్ సౌకర్యం వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారనీ, వాటన్నిటినీ సరళతరం చేయడంతోపాటుగా మరింత మెరుగ్గా ఇన్స్యూరెన్స్ సేవలు అందించేలా మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్లో రెన్యువల్ చేసుకోవడం, శాశ్వత వైకల్యం, యాక్సిడెంటల్ డెత్ వంటివాటిని ఇన్స్యూరెన్స్ పరిధిలోకి తీసుకురావడం, 75,000 నుంచి 1,00,000 రూపాయల వరకు హాస్పిటలైజేషన్ కవరేజీ, వంటివి ఈ కొత్త స్కీమ్ ప్రత్యేకతలు.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







