ఆగస్ట్ 1 నుంచి భారతీయ కార్మికులకు మేలైన ఇన్స్యూరెన్స్ కవరేజ్
- July 28, 2017
దుబాయ్: ఆగస్ట్ 1 నుంచి ఇండియన్ బ్లూ కాలర్ వర్కర్స్కి బెటర్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ అందనుంది. ఇందుకుగాను, తప్పనిసరి ఇన్స్యూరెన్స్ స్కీమ్ని మరింత సరళతరం చేసింది భారత ప్రభుత్వం. ప్రవాసీ భారతీయభీమా యోజనా (పిబిబివై) పేరుతో రూపొందించిన ఈ స్కీమ్ 18 దేశాల్లో పనిచేస్తోన్న భారతీయ కార్మికులకు ఉపయోగకరంగా మారనుంది. ఆగస్ట్ 1 నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుందని దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ పేర్కొంది. యూఏఈలో 2.8 మిలియన్ భారతీయులు బ్లూ కాలర్ వర్కర్స్గా పనిచేస్తున్నారు. గతంలో ఇన్స్యూరెన్స్కి సంబంధించి కొన్ని నిబంధనలు కఠినతరంగా ఉండేవనీ, ఆ కారణంగా కార్మికులు ఇన్స్యూరెన్స్ సౌకర్యం వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారనీ, వాటన్నిటినీ సరళతరం చేయడంతోపాటుగా మరింత మెరుగ్గా ఇన్స్యూరెన్స్ సేవలు అందించేలా మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్లో రెన్యువల్ చేసుకోవడం, శాశ్వత వైకల్యం, యాక్సిడెంటల్ డెత్ వంటివాటిని ఇన్స్యూరెన్స్ పరిధిలోకి తీసుకురావడం, 75,000 నుంచి 1,00,000 రూపాయల వరకు హాస్పిటలైజేషన్ కవరేజీ, వంటివి ఈ కొత్త స్కీమ్ ప్రత్యేకతలు.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









