పాక్లో ఘోర ప్రమాదం, 16 మంది సజీవ దహనం
- July 30, 2017
పాకిస్థాన్లో ఆదివారం మళ్లీ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రావల్పిండి నుంచి పెషావర్ వైపు వెళుతున్న వ్యాను గ్యాస్ పైప్లైన్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాను పూర్తిగా దగ్ధమై అందులోని 16 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొని వ్యాను పక్కనే ఉన్న గ్యాస్ పైప్లైను వైపునకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకంది. సమాచారం అందుకొన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలు అదుపుచేశారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తుపట్టలేకపోతున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి షెహ్బాజ్ షరీఫ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తామని తెలిపారు. ఇటీవల ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడడంతో కొన్ని వేల టన్నుల ఆయిల్ లీకైంది. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఆయిల్ పట్టుకోవడానికి ట్యాంకర్ చుట్టూ గుమిగూడారు. అదే సమయంలో ఓ వ్యక్తి సిగరెట్ వెలిగించడంతో ట్యాంకర్ పేలిపోయింది. ఈఘటనలో 153 మంది సజీవదహనమయ్యారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







