తెలంగాణ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బంగారం లభ్యం

- July 30, 2017 , by Maagulf
తెలంగాణ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బంగారం లభ్యం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆదివారం కస్టమ్స్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఓ ప్రయాణికుడి వద్ద 300 గ్రాముల బంగారు గొలుసుతో పాటు ఎలక్ర్టానిక్‌ వస్తువులు లభ్యమయ్యాయి. షార్జా నుంచి వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తెస్తున్నట్టు కస్టమ్స్‌ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఎయిర్‌ పోర్టులో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. షార్జా నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఓ ప్రయా ణికుడి వద్ద రెండు బంగారం గొలుసులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని తూకం వేయగా మూడు వందల గ్రాముల బరువు ఉన్నాయి. బంగారంతో పాటు అతని వద్ద ఉన్న లగే జీలో పలు రకాల ఎలక్ర్టానిక్‌ వస్తువులు లభ్యం అయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com