తెలంగాణ శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం లభ్యం
- July 30, 2017
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆదివారం కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఓ ప్రయాణికుడి వద్ద 300 గ్రాముల బంగారు గొలుసుతో పాటు ఎలక్ర్టానిక్ వస్తువులు లభ్యమయ్యాయి. షార్జా నుంచి వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తెస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఎయిర్ పోర్టులో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. షార్జా నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఓ ప్రయా ణికుడి వద్ద రెండు బంగారం గొలుసులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని తూకం వేయగా మూడు వందల గ్రాముల బరువు ఉన్నాయి. బంగారంతో పాటు అతని వద్ద ఉన్న లగే జీలో పలు రకాల ఎలక్ర్టానిక్ వస్తువులు లభ్యం అయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









