తెలంగాణ శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం లభ్యం
- July 30, 2017
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆదివారం కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఓ ప్రయాణికుడి వద్ద 300 గ్రాముల బంగారు గొలుసుతో పాటు ఎలక్ర్టానిక్ వస్తువులు లభ్యమయ్యాయి. షార్జా నుంచి వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తెస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఎయిర్ పోర్టులో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. షార్జా నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఓ ప్రయా ణికుడి వద్ద రెండు బంగారం గొలుసులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని తూకం వేయగా మూడు వందల గ్రాముల బరువు ఉన్నాయి. బంగారంతో పాటు అతని వద్ద ఉన్న లగే జీలో పలు రకాల ఎలక్ర్టానిక్ వస్తువులు లభ్యం అయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!









