బ్రిటన్లో భారతీయ మహిళ అరుదైన ఫీట్
- July 30, 2017
స్త్రీ గర్భంలో కవల పిల్లలు ఉన్నప్పుడు ఉండే ఎదుగుదల ఎలా ఉంటుంది ? ఒక శిశువు ఉన్నప్పుడు ఉండే ఎదుగుదలతో పోల్చితే, ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి ? అన్న విషయాల్ని తేల్చటం కోసం బ్రిటన్ వైద్యులు రూపొందించిన విధానం 'డిజిటల్ మానిటరింగ్'. ఈ విధానంలో ప్రపంచంలోనే తొలిసారిగా భారత సంతతి బ్రిటన్ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. మాలా వస్త్ ధురీ అనే మహిళ దక్షిణ లండన్లోని సెయింట్ జార్జ్ హాస్పిటల్లో కొద్ది రోజుల క్రితం కవల పిల్లలకి జన్మనిచ్చింది. ప్రసవానంతరం 2, 2.1 కిలోల బరువున్న ఇద్దరు నవజాత శిశువుల ఆరోగ్యం బాగుందని హాస్పిటల్ వైద్యులు తెలియజేశారు. 'డిజిటల్ మానిటరింగ్' విధానంలో గర్భస్త శిశువులపై 10వేల స్కానింగ్లు చేశారు. వీటిలో వచ్చిన రీడింగ్స్తో అనేక ఛార్ట్స్ రూపొందించారు. గర్భంలో కవల పిల్లల సహజసిద్ధమైన ఎదుగుదల (ఒక శిశువుతో పోల్చుతూ )ను ఈ ఛార్ట్స్ తెలియజేస్తాయి. వారిలోని లోపాల్ని, ఇతర సమస్యల్ని, ఎదుగుదలని, ప్రసవ సమయాన్ని అంచనావేయవచ్చు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









