కమల్పై రూ.100కోట్ల పరువు నష్టం దావా వేసిన తమిళగం పార్టీ నేత కృష్ణసామి
- July 30, 2017
ప్రముఖ నటుడు కమల్హాసన్పై పుథియ తమిళగం పార్టీ నేత కృష్ణసామి రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కమల్తో పాటు తమిళ బిగ్బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్న కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్ తదితరులపై పరువు నష్టం దావా వేశారు.
ఓ ఎపిసోడ్లో గాయత్రి రఘురామ్ మరో నటి ప్రవర్తన గురించి మాట్లాడుతూ.. ‘మురికివాడల్లో నివసించేవారిలా ఆ ప్రవర్తన ఏంటి’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. దాంతో మురికివాడల్లో నివసించే ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్హాసన్ కూడా మద్దతిస్తున్నారని పేర్కొంటూ కృష్ణసామి ఈ దావా వేశారు. మరో వారం రోజుల్లో కమల్ క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై కమల్ స్పందించాల్సి ఉంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







