కమల్‌పై రూ.100కోట్ల పరువు నష్టం దావా వేసిన తమిళగం పార్టీ నేత కృష్ణసామి

- July 30, 2017 , by Maagulf
కమల్‌పై రూ.100కోట్ల పరువు నష్టం దావా వేసిన తమిళగం పార్టీ నేత కృష్ణసామి

ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌పై పుథియ తమిళగం పార్టీ నేత కృష్ణసామి రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కమల్‌తో పాటు తమిళ బిగ్‌బాస్‌ కార్యక్రమంలో పాల్గొంటున్న కొరియోగ్రాఫర్‌ గాయత్రి రఘురామ్‌ తదితరులపై పరువు నష్టం దావా వేశారు.
ఓ ఎపిసోడ్‌లో గాయత్రి రఘురామ్‌ మరో నటి ప్రవర్తన గురించి మాట్లాడుతూ.. ‘మురికివాడల్లో నివసించేవారిలా ఆ ప్రవర్తన ఏంటి’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. దాంతో మురికివాడల్లో నివసించే ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్‌హాసన్‌ కూడా మద్దతిస్తున్నారని పేర్కొంటూ కృష్ణసామి ఈ దావా వేశారు. మరో వారం రోజుల్లో కమల్‌ క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై కమల్‌ స్పందించాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com