కమల్పై రూ.100కోట్ల పరువు నష్టం దావా వేసిన తమిళగం పార్టీ నేత కృష్ణసామి
- July 30, 2017
ప్రముఖ నటుడు కమల్హాసన్పై పుథియ తమిళగం పార్టీ నేత కృష్ణసామి రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కమల్తో పాటు తమిళ బిగ్బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్న కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్ తదితరులపై పరువు నష్టం దావా వేశారు.
ఓ ఎపిసోడ్లో గాయత్రి రఘురామ్ మరో నటి ప్రవర్తన గురించి మాట్లాడుతూ.. ‘మురికివాడల్లో నివసించేవారిలా ఆ ప్రవర్తన ఏంటి’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. దాంతో మురికివాడల్లో నివసించే ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్హాసన్ కూడా మద్దతిస్తున్నారని పేర్కొంటూ కృష్ణసామి ఈ దావా వేశారు. మరో వారం రోజుల్లో కమల్ క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై కమల్ స్పందించాల్సి ఉంది.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









