కమల్పై రూ.100కోట్ల పరువు నష్టం దావా వేసిన తమిళగం పార్టీ నేత కృష్ణసామి
- July 30, 2017
ప్రముఖ నటుడు కమల్హాసన్పై పుథియ తమిళగం పార్టీ నేత కృష్ణసామి రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కమల్తో పాటు తమిళ బిగ్బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్న కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్ తదితరులపై పరువు నష్టం దావా వేశారు.
ఓ ఎపిసోడ్లో గాయత్రి రఘురామ్ మరో నటి ప్రవర్తన గురించి మాట్లాడుతూ.. ‘మురికివాడల్లో నివసించేవారిలా ఆ ప్రవర్తన ఏంటి’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. దాంతో మురికివాడల్లో నివసించే ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్హాసన్ కూడా మద్దతిస్తున్నారని పేర్కొంటూ కృష్ణసామి ఈ దావా వేశారు. మరో వారం రోజుల్లో కమల్ క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై కమల్ స్పందించాల్సి ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









