ఉపాధ్యాయులు తమ జీతాల కోసం ఇక వేచి ఉండనవసరం లేదు
- July 31, 2017
మనామ: ఎటువంటి నోటీసు లేకుండా అల్ మజ్ద్ ప్రైవేట్ పాఠశాల మూసివేసిన తర్వాత ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పెండింగ్ జీతాలను చెల్లించేందుకు పాఠశాల మేనేజ్మెంట్ నిరాకరించినట్లు ఆరోపించారు. ఉపాధ్యాయుల అభిప్రాయం ప్రకారం, పాఠశాల మంత్రిత్వశాఖ ప్రమాణాల ప్రకారం ఆ పాఠశాల పనిచేయడం లేదని విద్య మంత్రిత్వశాఖ ఒక నోటీసును ఆ పాఠశాలకు అందించింది, దీని ఫలితంగా ఉపాధ్యాయ సిబ్బందిని తొలగించడం జరిగింది. "విద్య మంత్రిత్వశాఖ ఒక నోటీసును పంపినప్పుడు పాఠశాల మేనేజ్మెంట్ 2017జూన్ చివరి వారంలో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగాలను రద్దు చేసింది. 30 మంది కంటే ఎక్కువ ఉపాధ్యాయులను తొలగించారు. పాఠశాల రద్దు చేయబదిననాటికె మాకు ఆప్పటికీ మా బకాయి ( పెండింగ్ ) జీతాలు కోసం ఎదురుచూస్తున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వారు ఈ సందర్భంగా " మా గల్ఫ్ న్యూస్ డాట్ కామ్ " మాట్లాడుతూ, "మేము ఈ విషయమకీ మానవ వనరుల శాఖని పలుమార్లు పిలిచి తమ సమస్యను పరిష్కరించాలని పిలిచాము మరియు పాఠశాల యాజమాన్యం చాలాసార్లు సంప్రదించాము. వారు మాతో స్తబ్దుగా ఉండాలని కోరుతున్నారు. ఒక నెల కన్నా ఎక్కువ ఉన్న ఇంకా పెండింగ్ వేతనాలు మాకు ఇంకా చెల్లించలేదని ఒక ఉద్యోగి చెప్పాడు."మేము విద్య మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువెళ్ళేమని అయితే వారు ఈ విషయంలో మాకు సహాయం చేయలేమని చెప్పారు, ఎందుకంటే మేము చట్టబద్ధంగా పాఠశాల వర్క్ పర్మిట్ వీసా పరిధిలో ఉండకపోవడమే నని మరొక ఉపాధ్యాయుడు తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









