ఉపాధ్యాయులు తమ జీతాల కోసం ఇక వేచి ఉండనవసరం లేదు
- July 31, 2017
మనామ: ఎటువంటి నోటీసు లేకుండా అల్ మజ్ద్ ప్రైవేట్ పాఠశాల మూసివేసిన తర్వాత ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పెండింగ్ జీతాలను చెల్లించేందుకు పాఠశాల మేనేజ్మెంట్ నిరాకరించినట్లు ఆరోపించారు. ఉపాధ్యాయుల అభిప్రాయం ప్రకారం, పాఠశాల మంత్రిత్వశాఖ ప్రమాణాల ప్రకారం ఆ పాఠశాల పనిచేయడం లేదని విద్య మంత్రిత్వశాఖ ఒక నోటీసును ఆ పాఠశాలకు అందించింది, దీని ఫలితంగా ఉపాధ్యాయ సిబ్బందిని తొలగించడం జరిగింది. "విద్య మంత్రిత్వశాఖ ఒక నోటీసును పంపినప్పుడు పాఠశాల మేనేజ్మెంట్ 2017జూన్ చివరి వారంలో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగాలను రద్దు చేసింది. 30 మంది కంటే ఎక్కువ ఉపాధ్యాయులను తొలగించారు. పాఠశాల రద్దు చేయబదిననాటికె మాకు ఆప్పటికీ మా బకాయి ( పెండింగ్ ) జీతాలు కోసం ఎదురుచూస్తున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వారు ఈ సందర్భంగా " మా గల్ఫ్ న్యూస్ డాట్ కామ్ " మాట్లాడుతూ, "మేము ఈ విషయమకీ మానవ వనరుల శాఖని పలుమార్లు పిలిచి తమ సమస్యను పరిష్కరించాలని పిలిచాము మరియు పాఠశాల యాజమాన్యం చాలాసార్లు సంప్రదించాము. వారు మాతో స్తబ్దుగా ఉండాలని కోరుతున్నారు. ఒక నెల కన్నా ఎక్కువ ఉన్న ఇంకా పెండింగ్ వేతనాలు మాకు ఇంకా చెల్లించలేదని ఒక ఉద్యోగి చెప్పాడు."మేము విద్య మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువెళ్ళేమని అయితే వారు ఈ విషయంలో మాకు సహాయం చేయలేమని చెప్పారు, ఎందుకంటే మేము చట్టబద్ధంగా పాఠశాల వర్క్ పర్మిట్ వీసా పరిధిలో ఉండకపోవడమే నని మరొక ఉపాధ్యాయుడు తెలిపారు.
తాజా వార్తలు
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు









